Deputy CM Pawan: ఇక్రిశాట్కు పవన్.. కుమారుడి కోసమేనా?
ABN , Publish Date - Jun 13 , 2025 | 04:27 PM
Deputy CM Pawan: పటాన్చెరులోని ఇక్రిశాట్ స్కూల్ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సందర్శించారు. కుమారుడు మార్క్ శంకర్ అడ్మిషన్ కోసమే పవన్ అక్కడకు వెళ్లినట్లు సమాచారం.

హైదరాబాద్, జూన్ 13: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) ఈరోజు (శుక్రవారం) పటాన్చెరులో పర్యటించారు. ఈ సందర్భంగా ఇక్రిశాట్ ఐఎస్హెచ్ను సందర్శించి.. అక్కడి టీచర్లతో మాట్లాడారు. కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ను ఇక్రిశాట్లో చేర్పించేందుకే పవన్ అక్కడకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇటీవల సింగ్పూర్ స్కూల్లో జరిగిన అగ్నిప్రమాదంలో పవన్ కుమారుడు గాయపడిన విషయం తెలిసిందే. అక్కడ చికిత్స తరువాత మార్క్ శంకర్ను హైదరాబాద్కు తీసుకువచ్చేశారు. ఈ క్రమంలో మార్క్ శంకర్ను ఇక్రిశాట్లో చేర్పించేందుకు అడ్మిషన్ కోసం పవన్ వెళ్లినట్లు సమాచారం.
కొద్దిరోజుల క్రితం సింగపూర్లోని స్కూల్లో జరిగిన ప్రమాదంలో పవన్, అన్నా లెజినోవా కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డారు. ఈ ఘటనలో మార్క్ కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. అంతేకాకుండా ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో ఇబ్బందిపడ్డాడు. ప్రమాదం జరిగిన వెంటనే మార్క్ శంకర్ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేశారు. కుమారిడికి ప్రమాదం జరిగిన సమయంలో పవన్ కళ్యాణ్ అల్లూరి సీతారామారాజు జిల్లా అరకు పర్యటనలో ఉన్నారు. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే డిప్యూటీ సీఎం హుటాహుటిన సింగపూర్కు వెళ్లారు.
అక్కడ చికిత్స తరువాత మార్క్ శంకర్ను ఇండియాకు తీసుకువచ్చేశారు పవన్. అనంతరం ఇక్కడ కూడా కొద్దిరోజుల పాటు చిన్నారికి చికిత్స చేయించారు. ఇప్పుడు మార్క్ శంకర్ పూర్తిగా కోలుకున్నారు. ఈ ఘటన తర్వాత కుమారుడు మార్క్ శంకర్ను ఇండియాలోనే చదవించాలని పవన్ నిర్ణయించినట్లు సమాచారం. అందులో భాగంగానే పటాన్చెరులోని ఇక్రిశాట్లో మార్క్ను చేర్చించేందుకే అడ్మిషన్ కోసం పవన్ అక్కడకు వెళ్లినట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి
రోడ్డు పక్కన్న నిల్చున్న వారిపైకి దూసుకెళ్లిన కారు
తల్లుల ఖాతాల్లోకి నిధులు.. ఆనందంలో కుటుంబాలు
Read Latest AP News And Telugu News