TDP: రాష్ట్రాభివృద్ధిని రాక్షసుల్లా అడ్డుకుంటున్నారు
ABN , Publish Date - Jul 30 , 2025 | 05:01 AM
రుషులు యజ్ఞం చేస్తుంటే రాక్షసులు భగ్నం చేసేందుకు ప్రయత్నించినట్లుగా సీఎం చంద్రబాబు రాష్ట్రానికి మంచి

వైసీపీ నాయకులపై దీపక్రెడ్డి ఆగ్రహం
అమరావతి, జూలై 29(ఆంధ్రజ్యోతి): రుషులు యజ్ఞం చేస్తుంటే రాక్షసులు భగ్నం చేసేందుకు ప్రయత్నించినట్లుగా సీఎం చంద్రబాబు రాష్ట్రానికి మంచి చేస్తుంటే జగన్ అడ్డుకుంటున్నారని సీడ్ ఏపీ చైౖర్మన్ దీపక్ రెడ్డి విమర్శించారు. మంగళవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘జగన్ రాష్ట్రాన్ని 20 సంవత్సరాల వెనక్కి తీసుకెళ్లారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే అనేక కంపెనీలను తెచ్చి రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తోంది. ‘గత వైసీపీ ప్రభుత్వం చేసిన ఆరోపణలతో ఏపీకి రాకూడదని అనుకున్నాం. ఇప్పుడు చంద్రబాబుపై గౌరవంతో మళ్లీ రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు అయ్యేందుకు ముందుకొస్తున్నామని సింగపూర్ ప్రభుత్వం చెప్పింది’ అంటే సీబీఎన్కు ఉన్న ఇమేజ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు’’ అని దీపక్ రెడ్డి అన్నారు.