Toll gate: నేటి నుంచి టోల్ గేట్ వసూళ్లు
ABN , Publish Date - May 30 , 2025 | 12:36 AM
ఏర్పేడు మండలంలోని మేర్లపాక సమీపంలో పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై శుక్రవారం నుంచి టోల్ ఛార్జీలు వసూలు చేయనున్నారు.

ఏర్పేడు, మే 29(ఆంధ్రజ్యోతి): ఏర్పేడు మండలంలోని మేర్లపాక సమీపంలో పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై శుక్రవారం నుంచి టోల్ ఛార్జీలు వసూలు చేయనున్నారు. జాతీయ రహదారికి సంబంధించిన అధికారులు మూడు రోజులుగా ట్రయల్స్ వేశారు. కారుకు రూ.140, బస్సు, ట్రక్కులకు రూ.470 చొప్పున వసూలు చేయనున్నట్లు బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ టోల్గేట్కు ఇరువైపులా 20 కిలోమీటర్ల మేరకు ఉన్న వైట్ బోర్డు వాహనదారులు నెలకు రూ.350 చెల్లించి పాస్ తీసుకోవాల్సి ఉంటుంది.