Share News

Tirupati Land Grabbers: రాత్రికి రాత్రే ఆలయం నేలమట్టం.. రెచ్చిపోతున్న భూబకాసురులు

ABN , Publish Date - Jun 14 , 2025 | 01:15 PM

Tirupati Land Grabbers: తిరుచానూరులో నాగాలమ్మ ఆలయాన్ని భూకబ్జాదారులు నేలమట్టం చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. భూకబ్జాదారులను గ్రామస్తులు చితకబాదారు.

Tirupati Land Grabbers: రాత్రికి రాత్రే ఆలయం నేలమట్టం.. రెచ్చిపోతున్న భూబకాసురులు
Tirupati Land Grabbers

తిరుపతి, జూన్ 14: జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గం తిరుచానూరు పరిధిలో భూకబ్జాదారులు రెచ్చిపోతున్నారు. స్థానికంగా ఉన్న నాగాలమ్మ ఆలయాన్ని (Nagalamma Temple) నేలమట్టం చేశారు. కొద్దిరోజుల క్రితం ఒక కాలనీకి కాలనీనే భూకబ్జాదారులు నేలమట్టం చేశారు. అంతటితో ఆగకుండా మూడు రోజుల క్రితం ఓ ఆలయాన్ని కూడా కూల్చేశారు. ఇప్పుడు తాజాగా గత రాత్రి నాగాలమ్మ ఆలయాన్ని నేలమట్టం చేశారు భూబకాసురులు. ఆలయం నేలమట్టం అవడంతో గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయాన్ని కూల్చేసిన రౌడీషీటర్‌ను, భూ కబ్జాదారుడిని చితకబాదారు.


నాగాలమ్మ ఆలయం ఉన్న స్థలం మొత్తం 22 ఏలో ఉంది. గత ప్రభుత్వంలో ఈ స్థలం మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరవర్గం చేతిలో ఉంది. ఇప్పటికి కూడా ఈ స్థలానికి రిజిస్ట్రేషన్ లేదు. అయితే ఇప్పుడు ఈ గుడికి సంబంధించిన స్థలాన్ని 22ఏ నుంచి తొలగిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆ తరువాత ఆలయానికి సంబంధించిన గోడను కూల్చేశారు కబ్జాదారులు. అర్ధరాత్రి ఆలయాన్ని నేలమట్టం చేసేశారు. అయితే దామినీడు గ్రామంలో ఉన్న అన్ని భూములు ఇప్పటికీ 22ఏలోనే ఉన్నాయి. కబ్జాదారులకు మాత్రం ఆ స్థలాన్ని 22ఏ నుంచి తొలగించి అధికారులు ఎలా ఉత్తర్వులు ఇచ్చారంటూ గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు.


గతంలో వైసీపీలో ఉన్న వ్యక్తికి అధికారులు సహకరించడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. పెద్దిరెడ్డి సన్నిహితుడు కృష్ణమూర్తి నాయుడు ఇదంతా చేయిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వందల సంవత్సరాల నుంచి ఉన్న గుడి తమది అంటూ కబ్జాదారులు బెదరిస్తున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. 26 మంది రైతులు కలిసి గుడిని కట్టుకున్నామని.. తిరుచారూను గ్రామాస్థులు, దామినీడు గ్రామస్థులు ఇక్కడ ఎన్నో ఏళ్లుగా పూజలు చేస్తున్నారని తెలిపారు. జాతర సమయంలో పూజలు చేయనీకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు. మహిళలపై దాడుల చేశారని.. పోలీస్‌‌స్టేషన్‌లో మహిళలను అసభ్య పదజాలంతో దూషించారని అన్నారు. రాక్షసుల్లా అర్ధరాత్రి వచ్చి గుడిని పూర్తిగా నేలమట్టం చేశారని మండిపడ్డారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) స్పందించి.. తమకు న్యాయం చేయాలని దామనీడు గ్రామాస్తులు కోరుతున్నారు.


ఇవి కూడా చదవండి

జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. తాడపత్రిలో ఏం జరుగుతోంది

లక్ష దాటిన బంగారం ధర.. ఈ రోజు ఎంతంటే..

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 14 , 2025 | 01:40 PM