Share News

Chandrababu Naidu: తెలుగుజాతి అభ్యున్నతికి పునరంకితమవుతా

ABN , Publish Date - Apr 21 , 2025 | 04:29 AM

ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి కోసం తన కృషిని మళ్లీ పునరంకితం చేస్తానని సీఎంగా నాల్గోసారి అవకాశం ఇచ్చిన తెలుగు ప్రజలకు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. స్వర్ణాంధ్ర-2047 విజన్‌తో సమాజంలోని అసమానతలు తగ్గించి, రాష్ట్రాన్ని ప్రపంచ ఆవిష్కరణల కేంద్రంగా తీర్చిదిద్దాలని ఆయన సంకల్పం వ్యక్తం చేశారు

Chandrababu Naidu: తెలుగుజాతి అభ్యున్నతికి పునరంకితమవుతా

  • 2047నాటికి ప్రపంచంలోనే శక్తిమంతంగా ఉండాలి

  • రాష్ట్రాన్ని ప్రపంచ ఆవిష్కరణల కేంద్రంగా నిలపాలి

  • నాటి ‘జన్మభూమి’తో సమాజంలో ఎంతో మార్పు

  • నేటి పీ-4తో స్వర్ణ కుటుంబాలుగా మార్చే యత్నం

  • స్వర్ణాంధ్ర-2047 విజన్‌ అందరి ఆకాంక్షల సమాహారం

  • ప్రజల భవిష్యత్‌ కలల సాకారానికి నిరంతరం కష్టపడతానని మాటిస్తున్నా

  • జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన అందరికీ సీఎం చంద్రబాబు ధన్యవాదాలు

అమరావతి, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి కోసం.. తెలుగు ప్రజల అభ్యున్నతి కోసం పునరంకితమవుతానని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ ఆయన ‘ఎక్స్‌’లో ధన్యవాదాలు తెలియజేశారు. ‘75 ఏళ్ల నా జీవన ప్రయాణంలో, 47 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో నాకు ఎప్పుడూ తోడునీడగా ఉండి, ముందుకు నడిపించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ప్రజాసేవ చేసేందుకు నాలుగోసారి సీఎంగా అవకాశం కల్పించిన తెలుగు ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. తెలుగు సమాజం పురోగతి కోసం అలుపు లేకుండా పనిచేసేలా మీరంతా నాలో ఉత్సాహం నింపారు. మీ భవిష్యత్‌ కలలు, ఆకాంక్షలను సాకారం చేయడానికి నిరంతరం కష్టపడి పనిచేస్తానని మాటిస్తున్నాను’ అని ప్రజలకు హామీ ఇచ్చారు. స్వర్ణాంధ్ర-2047 విజన్‌ అందరి ఆకాంక్షల సమాహారమన్నారు. అందరి సహకారంతో ఆ కలను నిజం చేస్తానని తెలిపారు.


efer.jpg

‘ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ ఆవిష్కరణలకు, అవకాశాలకు కేంద్రంగా తీర్చిదిద్దాలన్నదే నా తపన, ‘థింక్‌ గ్లోబల్లీ- యాక్ట్‌ గ్లోబల్లీ’ విధానంతో రాష్ట్రాన్ని నాలెడ్జ్‌ ఎకానమీ కేంద్రంగా తీర్చిదిద్దుకుందాం. సమాజంలో అసమానతలు పోవాలి. పేద, ధనిక వర్గాల మధ్య అంతరాలు తగ్గాలి. పేదరికం లేని సమాజమే నా సంకల్పం. అందుకే పీ4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మూడు దశాబ్దాల నాడు నేను ప్రవేశపెట్టిన జన్మభూమి సమాజంలో ఎంతో మార్పు తెచ్చింది. ఈసారి తీసుకొచ్చిన పీ4 రాష్ట్రంలోని పేద కుటుంబాలను స్వర్ణ కుటుంబాలుగా చేయాలన్నది నా ప్రయత్నం. వ్యక్తి శ్రేయస్సే.. సమాజ శ్రేయస్సుగా నేను భావిస్తాను. జనం మన బలం. జనాభా సమర్థ నిర్వహణ ద్వారా సమగ్ర అభివృద్ధి సాధించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు సాధిస్తున్న విజయాలు మనకెంతో గర్వకారణం. అత్యధిక తలసరి ఆదాయం ఆర్జిస్తున్నవారిలో ముందు వరుసలో ఉన్నాం. దేశభక్తి చాటేలా వికసిత్‌ భారత్‌, స్వర్ణాంధ్ర లక్ష్యాల సాధనకు చేయిచేయి కలుపుదాం. నాతోపాటు అందరూ ఇందులో భాగస్వాములవ్వాలని ఆహ్వానిస్తున్నాను’ అని పేర్కొన్నారు.


ఇది కూడా చదవండి..

Lightning Strike: క్రికెట్ ఆడుతోండగా పిడుగు పడి.. యువకులు మృతి

Minister Narayana: గుజరాత్‌లో పటేల్ విగ్రహాన్ని పరిశీలించిన మంత్రి నారాయణ బృందం

YSRCP: అధికారం కోల్పోయినా.. అరాచకాలు ఆగలేదు

10th class Students: సార్, ఛాయ్‌ తాగండి, నన్ను పాస్‌ చేయండి

CM Chandrababu: టీ 20 మ్యాచెస్ ఎంత ఇంట్రెస్ట్‌గా ఉంటాయో.. అసెంబ్లీ సమావేశాలు..

CM Chandrababu Birthday: సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకల్లో అపశృతి

For Andhrapradesh News And Telugu News

Updated Date - Apr 21 , 2025 | 04:29 AM