Share News

Tirumala Namaz Case: తిరుమలలో నమాజ్‌ చేసిన వ్యక్తిపై కేసు నమోదు

ABN , Publish Date - May 24 , 2025 | 04:10 AM

తిరుమలలో టిటిడి నిబంధనలను ఉల్లంఘిస్తూ కల్యాణవేదిక వద్ద ఒక వ్యక్తి నమాజ్‌ చేసాడు. టూటౌన్‌ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

Tirumala Namaz Case: తిరుమలలో నమాజ్‌ చేసిన వ్యక్తిపై కేసు నమోదు

తిరుమల, మే 23(ఆంధ్రజ్యోతి): టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా తిరుమలలో నమాజ్‌ చేసిన వ్యక్తిపై టూటౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. తిరుమలలోని కల్యాణవేదికలో గురువారం అన్యమతానికి చెందిన ఓ వ్యక్తి నమాజ్‌ చేసిన వీడియో బయటకు వచ్చింది. ఈ మేరకు టూటౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. కారు నెంబరు ఆధారంగా అతన్ని చెన్నైకు చెందిన అబ్బా్‌సగా పోలీసులు గుర్తించినట్టు తెలిసింది. ఇక్కడ నమాజ్‌ చేయవచ్చా అని సమీపంలోని మరో వ్యక్తిని అడిగిన క్రమంలో చేసుకోవచ్చని చెప్పాడని, దాంతోనే నమాజ్‌ చేశాడని పోలీసులు ప్రాథమిక విచారణలో తేలినట్టు సమాచారం.

Updated Date - May 24 , 2025 | 04:11 AM