Botsa Satyanarayana: వారికి నా అభినందనలు: మాజీ మంత్రి బొత్స
ABN , Publish Date - Apr 24 , 2025 | 08:54 PM
వైసీపీ కార్పొరేటర్ల ఆర్థిక మూలాల మీద దెబ్బ కొడతామని కూటమి నేతలు బెదిరించారని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. తానెప్పుడూ ఇటువంటి రాజకీయాలను చూడలేదని పేర్కొన్నారు.

విశాఖ: కాశ్మీర్లో తీవ్రవాదుల కాల్పుల్లో 28 మంది చనిపోవడం బాధాకరమన్నారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. అందులో మన రాష్ట్రానికి చెందిన ఇద్దరు ఉండడం దురదృష్టమన్నారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తునన్నారు. వైసీపీ కార్పొరేటర్లతో సమావేశమైన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఈ క్రమంలోనే పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఎన్ని ప్రలోభాలు పెట్టినా..
వైసీపీ కార్పొరేటర్ల ఆర్థిక మూలాల మీద దెబ్బ కొడతామని కూటమి నేతలు బెదిరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తానెప్పుడూ ఇటువంటి రాజకీయాలను చూడలేదన్నారు. ఇది మంచి సాంప్రదాయం కాదని హెచ్చరించారు. వైసీపీ కార్పొరేటర్ల కోసం ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసి, 11 నెలల మేయర్ పదవి కోసం అవిశ్వాస తీర్మానం పెట్టారని అన్నారు. ఈ కొద్ది నెలల కాలంలో ఏం చేస్తారో చూద్దాం, ఎన్ని ప్రలోభాలు పెట్టినా మెజార్టీ కార్పొరేటర్లు వైసీపీ తోనే ఉన్నారని.. వారందరినీ అభినందిస్తున్నానని బొత్స వ్యాఖ్యానించారు.
కాగా, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక సంస్థల్లో వైసీపీ నుంచి గెలుపొందిన పలువురు ప్రజా ప్రతినిధులు ఆ పార్టీని వీడి కూటమిలోని పార్టీల్లో చేరుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే, విశాఖ నగర పాలక సంస్థకు చెందిన 12 మంది కార్పొరేటర్లు వైసీపీకి గుడ్ బై చెప్పి కూటమి ప్రభుత్వంలో చేరగా, గత నెల మరో 9 మంది కార్పొరేటర్లు టీడీపీలో చేరారు.
Also Read:
AP Pensions: ఏపీలో కొత్త పెన్షన్లకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్
నాయీ బ్రాహ్మణులకు కూటమి ప్రభుత్వం గుడ్న్యూస్
Pakistan Stock Market: అతలాకుతలమైన పాకిస్థాన్ స్టాక్ మార్కెట్