Toli Adugu Vijaya Yatra: ఈ నెల 23 నుంచి కూటమి ప్రభుత్వ తొలి అడుగు విజయ యాత్ర
ABN , Publish Date - Jun 13 , 2025 | 10:10 PM
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఈనెల 23 నుంచి నెల రోజులపాటు ఇంటింటికీ తొలి అడుగు విజయయాత్ర నిర్వహించబోతుంది. అటు, శుక్రవారం నాడు టీడీపీ శ్రేణులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో పార్టీ అధినేత చంద్రబాబు పలు కీలక ఆదేశాలిచ్చారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఈనెల 23 నుంచి నెల రోజులపాటు ఇంటింటికీ ‘తొలి అడుగు’ విజయ యాత్ర కార్యక్రమం నిర్వహించబోతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ సంస్థాగత కమిటీలు త్వరగా పూర్తి చేయాలని.. పార్టీ కోసం పని చేసేవారికి చోటు కల్పించాలని నాయకులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. జులైలో పార్టీ నేతలు, కార్యకర్తలకు నాయకత్వ శిక్షణా శిబిరాలు నిర్వహించాలని తలపెట్టారు. ఇకపై ఎమ్మెల్యేలు ప్రతి రోజూ పార్టీకి కొంత సమయం కేటాయించాలని టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశించారు.
ఈనెల 21వ తేదీన లక్ష చోట్ల నిర్వహించే యోగా డే సన్నాహక కార్యక్రమంలో పాల్గొనాలని పార్టీ శ్రేణులకు ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. తల్లికి వందనం నిధులు విడుదలతో సర్వత్రా సంతృప్తి వ్యక్తమవుతున్న నేపథ్యంలో వచ్చే వారమే అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తామని కూడా సీఎం చంద్రబాబు తెలిపారు. ఒకే నెలలో రెండు సూపర్-6 పథకాలు అమలు చేసి చూపిస్తున్నామన్నారు సీఎం చంద్రబాబు. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నేతలు, గ్రామస్థాయి కార్యకర్తలతో టెలీకాన్ఫరెన్స్లో పాల్గొని సీఎం చంద్రబాబు నాయుడు కీలక సూచనలు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మీ పర్సనల్ లోన్ ఇలా తీర్చుకోండి.. మీ ఖర్చులు తగ్గించుకోండి..
పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. జూన్ 15 లాస్ట్ డేట్, లేదంటే..
For National News And Telugu News