Food Security Committee: రాష్ట్రంలో పోషకాహార మిషన్కు కమిటీ ఏర్పాటు
ABN , Publish Date - Jun 13 , 2025 | 06:05 AM
రాష్ట్రంలో ఆహార భద్రత, పోషకాహార మిషన్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీని కార్యకలాపాలను పర్యవేక్షిస్తూ, మిషన్ను నడిపించడానికి ప్రభుత్వ...

అమరావతి, జూన్ 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఆహార భద్రత, పోషకాహార మిషన్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీని కార్యకలాపాలను పర్యవేక్షిస్తూ, మిషన్ను నడిపించడానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన వివిధ శాఖల ఉన్నతాకారులు.. 11మందితో కార్యనిర్వాహక కమిటీని నియమించింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, శ్రీలంక, భారత్లో వాతావరణ మార్పులకు ప్రభావాలకు గురయ్యే వర్గాల స్థితిని బలోపేతం చేయడానికి చేపట్టిన ఏడీఏపీటీ4ఆర్ ప్రాజెక్టుకు రాష్ట్ర, జిల్లా స్థాయి అమలు కమిటీలను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వు జారీ అయ్యింది.