Share News

Food Security Committee: రాష్ట్రంలో పోషకాహార మిషన్‌కు కమిటీ ఏర్పాటు

ABN , Publish Date - Jun 13 , 2025 | 06:05 AM

రాష్ట్రంలో ఆహార భద్రత, పోషకాహార మిషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీని కార్యకలాపాలను పర్యవేక్షిస్తూ, మిషన్‌ను నడిపించడానికి ప్రభుత్వ...

Food Security Committee: రాష్ట్రంలో పోషకాహార మిషన్‌కు కమిటీ ఏర్పాటు

అమరావతి, జూన్‌ 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఆహార భద్రత, పోషకాహార మిషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీని కార్యకలాపాలను పర్యవేక్షిస్తూ, మిషన్‌ను నడిపించడానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన వివిధ శాఖల ఉన్నతాకారులు.. 11మందితో కార్యనిర్వాహక కమిటీని నియమించింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, శ్రీలంక, భారత్‌లో వాతావరణ మార్పులకు ప్రభావాలకు గురయ్యే వర్గాల స్థితిని బలోపేతం చేయడానికి చేపట్టిన ఏడీఏపీటీ4ఆర్‌ ప్రాజెక్టుకు రాష్ట్ర, జిల్లా స్థాయి అమలు కమిటీలను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వు జారీ అయ్యింది.

Updated Date - Jun 13 , 2025 | 06:09 AM