Share News

Operation Sindoor: వీరజవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలకు ఏపీ మంత్రులు

ABN , Publish Date - May 11 , 2025 | 07:29 AM

Operation Sindoor:వీర జవాన్ మురళీనాయక్‌ పార్థివదేహానికి ఆదివారం ఆయన స్వగ్రామం కళ్లితండాలో అంత్యక్రియలు జరగనున్నాయి. అధికారిక, సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతాయి. ఈ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ప్రముఖులు రానుండడంతో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.

 Operation Sindoor: వీరజవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలకు ఏపీ మంత్రులు
Operation Sindoor

శ్రీ సత్యసాయి జిల్లా: పాకిస్థాన్‌ (Pakistan) సైనికులతో పోరాడుతూ జమ్మూ కశ్మీర్‌ (Jammu and Kashmir)లో అమరుడైన అగ్నివీర్‌ జవాన్‌ (Agniveer Jawan) మురళీ నాయక్‌ (Murali Naik) పార్థివదేహాన్ని ఆయన స్వగ్రామానికి తరలించారు. వీరజవాన్ అంత్యక్రియలు (Funeral) ఆదివారం జరగనున్నాయి. ఈ అంత్యక్రియలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోమ్ మంత్రి వంగలపూడి అనిత, మంత్రులు నారా లోకేష్, అనగాని సత్యప్రసాద్ తదితరులు హాజరు కానున్నారు. మురళీ నాయక్ అంత్యక్రియలకు స్వగ్రామం కళ్లితండాకు ప్రముఖుల రాకతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా ఇప్పటికే మురళీ నాయక్ పార్థీవ దేహం స్వగ్రామం కల్లితండాకు చేరుకుంది. అధికారిక, సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతాయి.


దారి పొడవునా జనం నివాళులు...

మురళీనాయక్‌ పార్థివదేహాన్ని ఢిల్లీ నుంచి ఇండిగో విమానంలో బెంగళూరు ఎయిర్‌పోర్టుకు తీసుకువచ్చారు. అక్కడి నుంచి శనివారం రాత్రి శ్రీసత్యసాయి జిల్లా, గోరంట్ల మండలంలోని కళ్లితండాకు తీసుకువచ్చారు. సైనికాధికారులు మురళీనాయక్‌ పార్థివదేహాన్ని ఆయన తల్లిదండ్రులు శ్రీరామనాయక్‌, జ్యోతిబాయికి అప్పగించారు. ఆపరేషన్‌ సిందూర్‌లో పాల్గొన్న మురళీనాయక్‌ గురువారం అర్ధరాత్రి రాజౌరి సెక్టార్‌లో జరిగిన ఎదురుకాల్పుల్లో అమరుడైన సంగతి తెలిసిందే. శనివారం మధ్యాహ్నం 2 గంటలకు బెంగళూరు ఎయిర్‌పోర్టు వద్ద మురళీనాయక్‌ పార్థివ దేహంతో ప్రారంభమైన ర్యాలీ రాత్రి 9.30 గంటల వరకూ కొనసాగింది. దారి పొడవునా జనం పెద్ద సంఖ్య తరలివచ్చి నివాళులు అర్పించారు. వీరజవాన్‌ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి హాజరవుతారు.

Also Read: ఉగ్రభూత పీచమణచగా


కాన్వాయ్‌ వెంట మంత్రి సవిత

రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి సవిత, మహారాష్ట్ర నుంచి మంత్రి ఉదయ్‌ సామంత్‌ విమానాశ్రయంలో మురళీ నాయక్‌ పార్థివదేహానికి నివాళులు అర్పించారు. కర్ణాటక తరఫున దేవనహళ్లి తహసీల్దారు హాజరయ్యారు. అనంతరం ఎయిర్‌పోర్టు నుంచి రాష్ట్ర సరిహద్దు దాకా జీరో ట్రాఫిక్‌ మార్గం ఏర్పాటు చేసి పార్థివదేహాన్ని ఆర్మీ వాహన కాన్వాయ్‌లో తరలించారు. కాన్వాయ్‌ వెంట మంత్రి సవిత వచ్చారు. దారి పొడవునా జనం పెద్ద ఎత్తున తరలివచ్చి నివాళులు అర్పించారు. జాతీయ జెండాలు చేతబూని వాహనాలపై పూలు చల్లారు. యువకులు జాతీయ జెండాలతో బైక్‌ ర్యాలీలు నిర్వహించారు. కర్ణాటకలో చిక్కబళ్లాపుర, బాగేపల్లి తదితర ప్రాంతాల్లో జై జవాన్‌, మురళీనాయక్‌ అమర్‌రహే అంటూ ప్రజలు నినదించారు. బాగేపల్లి ఎమ్మెల్యే సుబ్బారెడ్డి సహా వందలాది మంది తరలివచ్చి నివాళులు అర్పించారు. శ్రీసత్యసాయి జిల్లా సరిహద్దులో కొడికొండ చెక్‌పోస్టు వద్ద హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి, ఎమ్మెల్యేలు కందికుంట వెంకటప్రసాద్‌, ఎంఎస్‌ రాజు, పరిటాల సునీత, టీడీపీ జిల్లా అధ్యక్షుడు అంజినప్ప, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యక్తిగత కార్యదర్శి డాక్టర్‌ సురేంద్ర, టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, వేలాది మంది జనం కన్నీటి నివాళులు అర్పించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఇంకా బుద్ధిరాలేదు.. మళ్లీ అవే తప్పుడు కూతలు..

విడదల రజిని ముఖ్య అనుచరుడు అరెస్ట్‌

For More AP News and Telugu News

Updated Date - May 11 , 2025 | 07:29 AM