Anantapur: బోరుగడ్డ అనిల్కు బెయిల్
ABN , Publish Date - May 04 , 2025 | 05:07 AM
అనంతపురంలో బోరుగడ్డ అనిల్కు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను దూషించిన కేసులో బెయిల్ మంజూరైంది. అనంతపురం జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో శనివారం ఉత్తర్వులు జారీ అయ్యాయి

అనంతపురంలో నమోదైన కేసులో మంజూరు
అనంతపురం క్రైం, మే 3(ఆంధ్రజ్యోతి): అనంతపురం నాలుగో పట్టణ పోలీ స్స్టేషన్లో నమోదైన కేసులో రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్కు బెయిల్ మంజూరైంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్లను దూషించినందుకు నమోదైన ఈ కేసులో బోరుగడ్డ బెయిల్ పిటిషన్ను గత నెలలో ఎక్సైజ్ కోర్టు తోసిపుచ్చడంతో అనంతపురం జిల్లా కోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. జిల్లా మొదటి అదనపు న్యాయస్థానం న్యాయాధికారి సత్యవాణి ఇరువర్గాల వాదనలు విని బోరుగడ్డ అనిల్కు బెయిల్ మంజూరు చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఇవి కూడా చదవండి
Goa Temple Stampede: గోవాలోని శ్రీ లరాయ్ దేవీ దేవాలయం యాత్రలో తొక్కిసలాట.. 7 దుర్మరణం
Nara Lokesh: అమరావతి అన్స్టాపబుల్
Read Latest AP News And Telugu News