Minister Narayana: పునఃప్రారంభం అదిరింది
ABN , Publish Date - May 04 , 2025 | 05:45 AM
అమరావతి పునఃప్రారంభ సభ ఊహించిన దానికంటే అద్భుతంగా జరిగిందని మంత్రి నారాయణ అన్నారు. మోదీ పర్యటనతో ప్రజల్లో ఉత్సాహం రెట్టింపవడంతో సభ విజయవంతమైందని పేర్కొన్నారు

మంత్రి నారాయణ
విజయవాడ, మే 3(ఆంధ్రజ్యోతి): అమరావతి పునఃప్రారంభోత్సవ కార్యక్రమం ఊహించినదానికంటే విజయవంతమైందని మంత్రి నారాయణ అన్నారు. శనివారం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. మోదీ పర్యటనకు రెట్టించిన ఉత్సాహంతో రాష్ట్రం నలుమూలల నుంచి అశేష ప్రజానీకం హాజరైంది. ప్రజా రాజధాని అనే అంశాన్ని మీడియా ప్రజల్లోకి తీసుకెళ్లడంతో సభ అనుకున్నదానికంటే విజయవంతమైంది. మీడియాకు ధన్యవాదాలు’ అని మంత్రి తెలిపారు.