Share News

Amaravahi Women: వాళ్లిద్దరి ఫొటోలని చెప్పులతో కొట్టిన అమరావతి మహిళలు

ABN , Publish Date - Jun 07 , 2025 | 09:57 PM

అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వీవీఆర్ కృష్ణంరాజు, కొమ్మినేని శ్రీనివాసరావు ఫొటోలను చెప్పులతో కొట్టారు ఏపీ మహిళలు. సాక్షి ఛానల్లో ప్రసారమైన 'లైవ్ విత్ కేఎస్ఆర్' డిబేట్లో..

Amaravahi Women: వాళ్లిద్దరి ఫొటోలని చెప్పులతో కొట్టిన అమరావతి మహిళలు
Amaravahi Women

ఇంటర్నెట్ డెస్క్: అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వీవీఆర్ కృష్ణంరాజు, కొమ్మినేని శ్రీనివాసరావు ఫొటోలను చెప్పులతో కొట్టారు ఏపీ మహిళలు. సాక్షి ఛానల్లో ప్రసారమైన 'లైవ్ విత్ కేఎస్ఆర్' డిబేట్లో జర్నలిస్ట్ వీవీఆర్ కృష్ణంరాజు, కొమ్మినేని శ్రీనివాసరావు.. అమరావతి మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఏపీవ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళనలకు దిగారు మహిళలు. సాక్షి మీడియా ఛానల్ అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమంటూ వారంతా నినాదాలు చేశారు.


ఇలా ఉండగా, 'లైవ్ విత్ కేఎస్ఆర్' డిబేట్లో జర్నలిస్ట్ వీవీఆర్ కృష్ణంరాజు, కొమ్మినేని శ్రీనివాసరావు అమరావతి మహిళల పట్ల అనుచితంగా మాట్లాడారన్నది ప్రధాన ఆరోపణ. మహిళలను కించపరిచే విధంగా వేశ్యలు అనే అసభ్యకరమైన పదజాలాన్ని వాడారని మహిళలు దుమ్మెత్తిపోస్తున్నారు.


దేవతల రాజధానిని వేశ్యల రాజధానిగా పోల్చిన దుర్మార్గులను వెంటనే అరెస్టు చేయాలని.. రాజధాని అమరావతి మహిళలు డిమాండ్ చేశారు. కృష్ణంరాజు దిష్టిబొమ్మను దగ్ధం చేసిన రాజధాని మహిళలు.. సాక్షి ఛానల్ ప్రతినిధులైన కృష్ణంరాజు, కొమ్మినేని శ్రీనివాస్ ఫోటోలను చెప్పులతో కొట్టారు.


అటు, రాజధాని రైతులు కూడా ఆందోళనకు దిగారు. సాక్షి మీడియా ఛానల్ అధినేత్రి వైఎస్ భారతి రెడ్డి.. ఆంధ్రప్రదేశ్ మహిళలందరికీ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సాక్షి ఛానల్‌ను వెంటనే మూసివేయాలంటూ నినాదాలు చేసిన రాజధాని రైతులు.. జర్నలిస్టులు వీవీఆర్ కృష్ణంరాజు, కొమ్మినేని శ్రీనివాసరావులను అరెస్టు చేయాలన్నారు. కఠిన శిక్షలు పడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.


మరోవైపు, రాజధాని అమరావతిపై జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళనలు జరుగుతున్నాయి. గొల్లపూడి వన్ సెంటర్‌లో సాక్షి దిష్టిబొమ్మను టీడీపీ నాయకులు దగ్ధం చేశారు.


అనుచిత వ్యాఖ్యలు చేసిన కృష్ణంరాజు.. సాక్షి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ మహిళల మనోభావాలు దెబ్బతినే విధంగా సాక్షి యాజమాన్యం వ్యవహరిస్తోందని ఆగ్రహించారు.


అటు, విజయవాడలోనూ అమరావతి రైతులు ఆందోళనకు దిగారు. అమరావతి మహిళలను ఉద్దేశించి అసభ్యకర వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టు కృష్ణంరాజు ఇంటిని అమరావతి రైతులు ముట్టడించారు.


విజయవాడ అయోధ్య నగర్‌లో ఉంటున్న కృష్ణంరాజు ఇంటికి వెళ్లి రైతులు నిరసన తెలియజేశారు. కృష్ణంరాజు డౌన్ డౌన్.. కృష్ణంరాజు క్షమాపణ చెప్పాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రైతుల రాకను గమనించి ఇంట్లో నుంచి కృష్ణంరాజు పరారైపోగా, అతని ఇంటి ముందు రైతులు ధర్నా చేశారు.


ఇవీ చదవండి:

4 శాతం వడ్డీకే రూ.3లక్షల లోన్.. రైతులకు కేంద్రం ఆఫర్..
ఆ నంబర్ల నుంచి వచ్చే ఫోన్లు అస్సలు లిఫ్ట్ చేయకండి..

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 07 , 2025 | 10:20 PM