రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక గద్దర్ తెలంగాణ అవార్డుల ప్రదానోత్సవం మరికాసేపట్లో హైదరాబాద్ మాదాపూర్లోని హైటెక్స్ వేదికగా జరగనుంది.
సినీ నటి కల్పికా గణేష్పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మరో కేసు నమోదు చేశారు. ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో అసభ్యకరమైన పదజాలం ఉపయోగించి దూషించిందంటూ కల్పికపై బాధితురాలు కీర్తన ఫిర్యాదు చేశారు.
KCR Health Checkup: ఆరోగ్య పరీక్షల కోసం మాజీ సీఎం కేసీఆర్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి వెళ్లారు. కేసీఆర్ వెంట కుటుంబసభ్యులు ఉన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్పై కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పనికిరాదని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రజల సొమ్మును ఇకపై కాళేశ్వరం కోసం ఖర్చు చేయొద్దని సూచించారు.
Prabhakar Rao SIT Inquiry: ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు మరోసారి సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు ప్రధాన నిందితుడిగా ఉన్నారు.
రేషన్ షాపుల్లో సన్నబయ్యం పంపిణీ ప్రక్రియ ఈనెల 30వ తేదీ వరకు కొనసాగుతుందని, వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా సివిల్ సప్లయిస్ అధికారి వనజాతారెడ్డి స్పష్టం చేశారు.
కూకట్పల్లి నియోజకవర్గ ప్రజల కనీస అవసరాలైన మౌలిక వసతుల కల్పనలో రాజీపడే ప్రసక్తే లేదని, నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి ప్రణాళిక బద్ధంగా అభివృద్ధి పనులను పరుగులు పెట్టిస్తామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.
కాంగ్రెస్ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్దామని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. వచ్చే ఎన్నికలనూ దృష్టిలో పెట్టుకొని గ్రామ గ్రామాల్లో కాంగ్రెస్ జెండా ఎగిరే విధంగా ప్రణాళిక రూపొందించుకొని ముందుకు వెళ్తామని తెలిపారు.
భారీ స్థాయిలో ఐఏఎస్ల బదిలీలకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం, నేడో రేపో ఐపీఎస్ల బదిలీలకు సంబంధించిన ఉత్తుర్వులను జారీ చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్పై సైబర్ క్రైం పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఫిర్యాదు చేశారు.