Home » Venkaiah Naidu
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి బిల్లుకు చట్టబద్ధత కల్పించే అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చర్చించారు. ఏపీ అసెంబ్లీ తీర్మానం చేసిన బిల్లును ఈ సమావేశాల్లోనే పెట్టి ఆమోదించాలని వెంకయ్య కోరారు.
దేశవ్యాప్తంగా అటల్ బిహారీ వాజ్పేయి శతజయంతి ఉత్సవాలు జరగటం సంతోషకరమని భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. ‘అటల్జీకి అక్షర నిరాజనం’ కవితా సంకలనం పుస్తకం ఆవిష్కరించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
పిల్లలను సంస్కారవంతులుగా తీర్చిదిద్దే బాధ్యత విద్యాలయాలపై ఉందని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. సమాజానికి ఉపయోగపడే మంచి వ్యక్తులుగా విద్యార్థులు ఎదగాలని సూచించారు.
దేశ భక్తి లేని వారు.. ఈదేశం విడిచి వెళ్లిపోతేనే మంచిదని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. దేశానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా దేశ ద్రోహే అవుతారని పేర్కొన్నారు.
మూడవ ప్రపంచ తెలుగు మహాసభలకు అంకురార్పణ జరిగింది. ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో తెలుగు మహాసభలకు ఏర్పాట్లు జరిగాయి.
మాజీ ప్రధాని, దివంగత నాయకుడు, భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయ్ జీవితం తెరిచిన పుస్తకం అని.. ప్రతి పేజీ స్ఫూర్తి దాయకం అని పేర్కొన్నారు భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. శ్యాం ప్రసాద్ ముఖర్జీ ఆశయ సాధన కోసం వాజ్పేయ్ నిరంతరం కృషి చేశారని చెప్పారు.
ఏ వ్యక్తి తన మూలాలను మర్చిపోకూడదని భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు సూచించారు. విదేశాలకు వెళ్లి సంపాదించుకోవడం కంటే మాతృమూర్తి, మాతృదేశానికి సేవ చేయడంలో వచ్చే ఆనందం వేరని పేర్కొన్నారు.
తాను చదువుకునే రోజుల్లో తెలియక హిందీ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నానని భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు గుర్తుచేశారు. తాను వీధి బడిలో చదువుకుని... ఉప రాష్ట్రపతి వరకు వెళ్లానని తెలిపారు.
నక్సల్స్పై కేంద్రప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలిపారు. నక్సల్స్ మూమెంట్ వీక్ అయిపోయిందని విమర్శించారు. నక్సల్స్లో ఎవరికి వాళ్లు తమ సిద్ధాంతాలు చెబుతారని అన్నారు. కమ్యూనిస్టుల మధ్యే ఎన్నో విబేధాలు ఉన్నాయని ఆరోపించారు వెంకయ్య నాయుడు.
ప్రజాప్రతినిధులు పార్టీ మారితే.. ఆ పార్టీ ద్వారా పొందిన పదవికి రాజీనామా చేయాలని వెంకయ్యనాయుడు తెలిపారు. రాజ్యాంగంలో 10వ షెడ్యూల్ని సవరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.