Home » Uttam Kumar Reddy Nalamada- Congress
గోదావరి నదిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన బనకచర్ల ప్రాజెక్టు అంతర్రాష్ట్ర జలవిధానానికి విరుద్ధమని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం అంగీకరించదని తేల్చి చెప్పారు.
ఎస్ఎల్బీసీ ప్రమాదం దురదృష్టకరమని...అత్యాధునిక టెక్నాలజీతో త్వరలో పనులు ప్రారంభిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి వెల్లడించారు. ఐదేళ్లలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి హామీ ఇచ్చారు.
బీఆర్ఎస్ హయాంలో కృష్ణా జలాల కేటాయింపులో తెలంగాణకు అన్యాయం జరిగిందని మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీకి వదిలిన 514 టీఎంసీల జలాల ఒప్పందాన్ని రద్దు చేసిందని తెలిపారు.
Minister Uttam Kumar Reddy: బీఆర్ఎస్, బీజేపీ నేతలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హెలికాప్టర్లో మంత్రులు పర్యటిస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి.ఈ విమర్శలపై వారికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాస్ కౌంటర్ ఇచ్చారు.
Ration Cards: కొత్త రేషన్ కార్డుల కోసం లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో వీటి మీద అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమన్నారంటే..
ముఖ్యమంత్రిగా 4వసారి బాధ్యతలు స్వీకరించిన సీఎం చంద్రబాబును తెలంగాణ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి అభినందించారు.
భారీ వర్షాలు, వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు మంగళవారం పర్యటించారు. బాధిత ప్రజలు, రైతులను ఆదుకుంటామని ధైర్యం చెప్పారు. పంట నష్టం అంచనాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
లంగాణలో నాలుగు రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. వానలు కుండపోతగా కురుస్తుండటంతో రాష్ట్రంలోని ప్రధాన చెరువులు అన్ని పొంగి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పలు కాలనీలు జలమయం అయ్యాయి. దీంతో ప్రజలు నరకయాతన పడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. సహాయక చర్యల్లో భాగంగా హుజూర్ నగర్ నియోజకవర్గంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విస్తృతంగా పర్యటించి బాధితులకు ధైర్యం చెప్పారు.
రాజధాని హైదరాబాద్లో వాన దడ పుట్టించింది. గంటన్నర పాటు కుండపోతతో కంగారు పుట్టించింది. మంగళవారం తెల్లవారుజామున విరుచుకుపడింది. సరూర్నగర్లో 14.91 బాలానగర్లో 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
తమ ప్రభుత్వం రాష్ట్రాన్ని మరోస్థాయికి తీసుకెళుతుందని, దేశంతో కాకుండా ప్రపంచంతో పోటీ పడేలా తీర్చిదిద్దుతామని మంత్రులు ఉత్తమ్కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు.