Home » Rajnath Singh
కేరళంలోని కష్టజీవులు, నిజాయతీపరులైన ప్రజలను దశాబ్దాలుగా లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్, యునైటెడ్ డెమోక్రటక్ ఫ్రంట్ వంచిస్తున్నాయని, రెండు కూటముల్లో ఎవరో ఒకరిని ఎంచుకోవడం కాకుండా రెండింటినీ ఇంటికి సాగనంపాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు.
పశ్చిమాసియాలో యుద్ధంతో దేశంలో గ్యాస్, క్రూడ్ ఆయిల్ సరఫరాలో సమస్యలు తలెత్తుతున్న నేపథ్యంలో కేంద్ర కీలక నిర్ణయం తీసుకుంది. సమస్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు కేంద్ర మంత్రులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది.
భారతదేశ ఇంధన భద్రత స్ధిరంగా ఉందని, అదనపు సరకుతో నౌకలు వస్తున్నాయని కేంద్ర అన్ని రాజకీయ పార్టీలకు భరోసా ఇచ్చింది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన బుధవారం సాయంత్రం పార్లమెంటు బిల్డింగ్లో అఖిల పక్ష సమావేశం జరిగింది.
పశ్చిమాసియా సంక్షోభంపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం బుధవారం సాయంత్రం 5 గంటలకు అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. దీనికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షత వహించనున్నారు.
రష్యా నుంచి 288 ఎస్-400 క్షిపణుల కొనుగోలుకు రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో డిఫన్స్ అక్విజిషన్ కౌన్సిల్ సుమారు రూ.10,000 కోట్ల ఒప్పందానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
విపక్ష నేత రాహుల్ గాంధీ తన ప్రసంగంలో ఆర్మీ మాజీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవణే రాసిన పుస్తకంలోని ఒక వాక్యాన్ని ప్రస్తావించడంతో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెంటనే అడ్డుకున్నారు.
మారిటైం సవాళ్లను ఎదుర్కొనే రీతిలో సముద్ర ప్రతాప్ యుద్ధ నౌకను తయారు చేసినట్టు కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ సందర్భంగా తెలిపారు. మారిటైం పొల్యూషన్, ఫైర్ పైటింగ్, సముద్ర, పర్యవరణ రక్షణతో పాటు కోస్తా తీరప్రాంతాల్లో పెట్రోలింగ్ సైతం నిర్వహిస్తుందన్నారు.
వీవీఐపీ పర్యటనలను దృష్టిలో ఉంచుకుని అయోధ్యలో భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. స్థానిక పోలీసులు పలు అంచెల భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. అయోధ్యను 5 జోన్లు, 10 సెక్యూరిటీ సెక్టార్ల కింద విభజించినట్టు సిటీ ఎస్పీ సీపీ త్రిపాఠి తెలిపారు.
ఈనెల 31న ప్రాణప్రతిష్ట ద్వాదశి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్టు శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ఇటీవల ప్రకటించారు. ఈ ఉత్సవాలకు రాజ్నాథ్ సింగ్ను ఆహ్వానించామని, ఆయన తన సమ్మతి తెలియజేశారని చెప్పారు.
లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ జర్మనీ పర్యటనలో ఉండటంతో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా స్పీకర్ ఇచ్చిన టీపార్టీలో పాల్గొన్నారు. విపక్షం తరఫున ప్రాతినిధ్యం వహించారు.