Home » Rajnath Singh
రక్షణ ఉత్పత్తులు, ఎగుమతులు లక్ష్యంగా మరింత పటిష్ట, స్వయంసమృద్ధ భారత్కు కృషి జరుగుతోందని, ఇదే సమయంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దృఢ వైఖరి తీసుకున్నామని రాజ్నాథ్ సింగ్ అన్నారు.
Defence Minister Rajnath Singh: 1971లో భారత్, పాకిస్థాన్ల మధ్య యుద్ధం జరిగినప్పుడు భారత నేవీ కూడా పాల్గొందని కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ గుర్తు చేశారు. భారత నేవీ దెబ్బకు పాక్ రెండుగా చీలిపోయిందని ఎద్దేవా చేశారు. ఆపరేషన్ సిందూర్ సమయంలోనూ భారత నేవీ రంగంలోకి దిగి ఉంటే.. ఈసారి పాక్ నాలుగు ముక్కలు అయ్యేదని చెప్పుకొచ్చారు.
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) త్వరలోనే తిరిగొస్తుందని, తాను భారత్లో అంతర్భాగమని ప్రకటించుకుంటుందని రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ పేర్కొన్నారు.
ఆయుధాలు, ఆయుధ వ్యవస్థల ఉత్పత్తిలో మన దేశ సంస్థలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ విమర్శించారు. ఆయుధాల సరఫరా కోసం కాంట్రాక్టుల మీద సంతకాలైతే చేస్తున్నారు కానీ, సరఫరా మాత్రం జరగదని వ్యాఖ్యానించారు.
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. అక్కడి ప్రజల మదిలో ఉన్న కోరిక ఏంటో ఆయన పంచుకున్నారు. మరి.. ఆయన ఏం అన్నారో ఇప్పుడు చూద్దాం..
పాకిస్థాన్ పీఓకేలోని ఉగ్రవాద శిబిరాలపై మే 7న జరిపిన మిలటరీ దాడులపై రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, నిపుణులైన సర్జన్లులా మన బలగాలు సత్తా చాటుకున్నాయని చెప్పారు. ''నిపుణులైన డాక్టర్లు, సర్జన్లు ఎలా వ్యవహరిస్తారో మన బలగాలు కూడా అలాగే పనిచేశాయి. ఉగ్రవాద మూలాలలై ప్రతిభావంతంగా దాడులు జరిపాయి'
భారత్ అభ్యంతరాలను బేఖాతరు చేయకుండా పాక్కు రెండో విడత లోన్ ప్యాకేజీగా 7 బిలియన్ల డాలర్లను ఐఎంఎఫ్ ఇటీవల ప్రకటించింది. ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి, సంస్కరణల కొనసాగింపునకు ఇస్లామాబాద్కు రుణం మంజూరు చేస్తున్నామని పేర్కొంది.
Operation Sindoor: పాక్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఆపరేషన్ సిందూర్పై దేశ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు చూసిందంతా ఓ ట్రైలర్ మాత్రమేనని అన్నారు.
పాకిస్థాన్ వంటి బాధ్యతారహితమైన, ధూర్త దేశం చేతిలో అణ్వాయుధాలు ఉండడం సురక్షితం కాదని, వాటిని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఐఏఈఏ) పరిధిలోకి తెచ్చి, పర్యవేక్షించాలని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు.
బాధ్యత లేని.. మూర్ఖమైన పాకిస్థాన్ లాంటి దేశం దగ్గర అణుబాంబులు ఉండటం మంచిది కాదని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. అన్ని అణుబాంబులను ఇంటర్ నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ స్వాధీనం చేసుకోవాలని విజ్ణప్తి చేశారు.