Home » Rajamundry
భారత్ గౌరవ్ పర్యాటక యాత్రలో భాగంగా సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ఈనెల 14న ‘గంగా-రామాయణ పుణ్య క్షేత్ర యాత్ర’ ప్రత్యేక రైలు బయలుదేరుతుందని ఐఆర్సీటీసీ అధికారులు తెలిపారు.
ఢిల్లీలో పర్యటన నిమిత్తం సీఎం చంద్రబాబు గురువారం నాడు ఢిల్లీ వెళ్లారు. కడప నుంచి నేరుగా ఢిల్లీకి గురువారం సాయంత్రం బయలుదేరారు. శుక్రవారం రాత్రి కూడా ఢిల్లీలోనే ముఖ్యమంత్రి బస చేయనున్నారు. ఢిల్లీ నుంచి శనివారం రాజమండ్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు రానున్నారు.
రాజమండ్రి గామన్ వంతెనపై లారీ డివైడర్ దాటి కారును ఢీకొట్టిన దారుణ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. వారు మనవరాలి పుట్టినరోజు సందర్భంగా కాకినాడ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
చర్లపల్లి రైల్వే టర్మినల్ నుంచి కాకినాడ, నర్సాపూర్ మార్గాల్లో 36 రైళ్లను పొడిగించినట్లు దక్షిణ మధ్యరైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. ఆ రైళ్ల వివరాలు, అవి ఎక్కడెక్కడ ఆగుతాయన్న వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
బోరుగడ్డ అనిల్ కోసం గుంటూరు పోలీసులు రాజమండ్రి జైలుకు వెళ్లారు.ఫాస్టర్ను బెదిరించిండంతో పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దీంతో పీటీ వారెంట్పై అనిల్ను అదుపులోకి తీసుకోనున్నారు.
రైలు ఎక్కారు.. నిఘా పెట్టారు. అందరూ నిద్రపోయిన వెంటనే పని మొదలు పెట్టారు. ఇలా డబ్బు బ్యాగ్తో ఉడాయించిన కేటుగాళ్లను విజయవాడ పోలీసులు టెక్నాలజీ సాయంతో అదుపులోకి తీసుకున్నారు. నిందితుల దగ్గరి నుంచి నగదును రికవరీ చేశారు.
విశాఖపట్నంలోని కేంద్ర కారాగారం లోపల గంజాయి మొక్క కనిపించడం ఆందోళనకు దారితీసింది. హోం మంత్రి అనిత ఆదివారం కేంద్ర కారాగారాన్ని సందర్శించారు.
విశాఖ కేంద్ర కారాగారంలో రెండు సెల్ఫోన్లు, రెండు పవర్ బ్యాంకులు, రెండు చార్జింగ్ వైర్లు లభించడం కలకలం రేపింది.
క్షణికావేశంలోనో, తెలిసీ తెలియకో తప్పులు చేసి జైలుపాలైన ఖైదీలను సంస్కరించాల్సిన కారాగారాలు వివాదాలకు నిలయాలుగా మారుతున్నాయి.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మహిళలు మొక్కు తీర్చుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా...