Home » Pranab Mukherjee
మాజీ ప్రధాని దివంగత మన్మోహన్ సింగ్కు రాజ్ఘాట్ మెమోరియల్ సైట్ వద్ద స్థలం కేటాయించాలని యావద్దేశం డిమాండ్ చేస్తే దానిని తోసిపుచ్చిన మోదీ ప్రభుత్వం అదే స్థలంలో ముఖర్జీ స్మారకానికి నిర్ణయించిందని డేనిష్ అలీ అన్నారు.
దివంగత రాష్ట్రపతి, భారతరత్న అవార్డు గ్రహీత ప్రణబ్ ముఖర్జీ స్మారక స్థూపాన్ని ఢిల్లీలో ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రభుత్వ గౌరవాలను అడిగి తీసుకోరాదని, వాటంతటవే వరించి రావాలని బాబా (ప్రణబ్) చెప్పేవారని, బాబా మెమెరీని గౌరవిస్తూ ముందుకు వచ్చిన ప్రధానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని షర్మిష్ట ముఖర్జీ చెప్పారు.
భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె, కాంగ్రెస్ మాజీ ప్రతినిధి శర్మిష్ట ముఖర్జీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సోమవారంనాడు కలుసుకున్నారు. తాను రాసిన ''ప్రణబ్ మై ఫాదర్: ఏ డాటర్ రిమెంబర్స్'' అనే పుస్తకం ప్రతిని ప్రధానికి అందజేశారు. ఈ విషయాన్ని శర్మిష్ట ముఖర్జీ తన 'ఎక్స్' ఖాతాలో పేర్కొన్నారు.
కాంగ్రెస్ అగ్రనేతకు సంబంధించిన కొన్ని విషయాలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో వైరల్ గా మారాయి. దివంగత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ఠ ముఖర్జీ తన తండ్రిపై ఒక పుస్తకాన్ని రాశారు.