Home » Poets and Novelists
పద్మశ్రీ డాక్టర్ ఆశావాది ప్రకాశరావు అనంత సాహితీ ప్రకాశం అని జనప్రియ కవి ఏలూరి యంగన్న పేర్కొన్నారు. ఆశావాది ప్రకాశరావు తృతీయ వర్ధంతిని పురస్కరించుకుని సోమవారం మొదటిరోడ్డులోని పొట్టి శ్రీరాములు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తెలుగు వెలుగు సాహిత్య సామాజిక సేవాసంస్థ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాల లు వేసి నివాళులర్పించారు.
తెలుగు సాహితీ వినీలాకాశంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆధునిక సాహితీదిగ్గజం... కవి, కథకుడు, నవలా రచయిత కాశీభట్ల వేణుగోపాల్(72) సోమవారం కన్నుమూశారు.
‘కన్నీటి చెమ్మను కదిలించలేని కవిత్వాన్ని నేను ఊహించలేను. మనిషి వినియోగదారుడై.. కేవలం వస్తువుగా రూపమెత్తినపుడు.. ప్రశ్నలు పోగొట్టుకొని తలవంచుకొని నిలబడటం కవి, కవిత్వ లక్షణం కాదు’ అని ప్రముఖ కవి జూకంటి జగన్నాథం పేర్కొన్నారు.