Home » Padmasree
Manda Krishna Madiga: పద్మశ్రీ పురస్కారం ఎమ్మార్పీఎస్ శ్రేణులు, ఉద్యమానికి దక్కిన గౌరవమని, జాతికి అండగా ఉన్న సమాజానికి వచ్చిన గుర్తింపుగా భావిస్తున్నామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. లక్ష్యం కోసం పనిచేస్తే గుర్తింపు, గౌరవం వస్తుందనడానికి తనకు వచ్చిన పురస్కారమే నిదర్శనమని అన్నారు.
శనివారం రాత్రి నిజామాబాద్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్షా, కిషన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
Padma Awards: గణతంత్ర దినోత్సవ సంబురాల వేళ కేంద్ర ప్రభుత్వం శనివారం నాడు పద్మ పురస్కారాలు ప్రకటించింది. పలు రంగాల్లో విశేష సేవలు అందించిన వారిని ఈ ప్రతిష్టాత్మక అవార్డులకు కేంద్రం ఎంపిక చేసింది.
భారత 76వ 'రిపబ్లిక్ డే'ను పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక 'పద్మ' అవార్డులను ప్రకటించింది. 103 మందికి పద్మశ్రీ అవార్డులు, 19 మంది పద్మభూషణ్ , ఏడుగిరికి పద్మవిభూషణ్ అవార్డులను ప్రకటించింది.
కంచుమేళం (డోలి) కళాకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత సకిని రామచంద్రయ్య (65) ఆదివారం ఉదయం ఆనారోగ్యంతో మృతిచెందారు. అంతరించిపోతున్న డోలు వాయిద్యానికి జీవం పోసిన ఆయన 2022 జనవరి 25న రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్నారు.
మణుగూరు మండలం బావి కూనవరం(Bavi Koonavaram) గ్రామానికి చెందిన పద్మ శ్రీ అవార్డు గ్రహీత(Padma Shri awardee) సకిని రాంచంద్రయ్య (Sakini Ramchandraiah) కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో స్వగ్రామంలోనే ఆయన ప్రాణాలు వదిలినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.