• Home » Ibrahimpatnam

Ibrahimpatnam

ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఎన్నికల్లో మరో ట్విస్ట్.. కలెక్టర్‌కు ఫిర్యాదు..

ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఎన్నికల్లో మరో ట్విస్ట్.. కలెక్టర్‌కు ఫిర్యాదు..

కాంగ్రెస్ అభ్యర్థి చంద్రకళ కలెక్టర్ కార్యాలయాన్ని ఆశ్రయించారు. 23వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ శ్వేతపై ఆమె కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. జనరల్ కేటగిరికి చెందిన శ్వేత.. బీసీ రిజర్వ్ స్థానంలో పోటీ చేసి గెలిచారని ఆరోపించారు.

హైకోర్టు ముందుకు ఇబ్రహీంపట్నం కౌన్సిలర్ యాదగిరి

హైకోర్టు ముందుకు ఇబ్రహీంపట్నం కౌన్సిలర్ యాదగిరి

ఇబ్రహీంపట్నం 19వ వార్డు కౌన్సిలర్ ఆకుల యాదగిరిని హైకోర్టులో పోలీసులు హాజరుపర్చారు. యాదగిరి స్టేట్‌మెంట్‌ను హైకోర్టు రికార్డు చేస్తోంది.

ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్ గెలుపు

ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్ గెలుపు

ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీని బీఆర్ఎస్ దక్కించుకుంది. మొత్తం 24 వార్డుల్లో 13 స్థానాల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు.

ఇబ్రహీంపట్నంలో జగన్ అభిమానుల హల్‌చల్

ఇబ్రహీంపట్నంలో జగన్ అభిమానుల హల్‌చల్

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జగన్ అభిమానులను నిలువరించేందుకు పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు పూర్తిగా విఫలమయ్యాయి.

ఇబ్రహీంపట్నంలో టెండర్ ఓటు

ఇబ్రహీంపట్నంలో టెండర్ ఓటు

ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో ఒకరి ఓటును మరొకరు వేయడం కలకలం రేపింది. పాటిబండ్ల జ్ఞానదీప్తి ఓటును మరొకరు వేశారు.

TG News: హాస్టల్‌లో ఒంటిరిగా ఉన్న బీటెక్‌ విద్యార్థినిపై..

TG News: హాస్టల్‌లో ఒంటిరిగా ఉన్న బీటెక్‌ విద్యార్థినిపై..

Telangana: ఇంజనీరింగ్ విద్యార్థినిపై డ్రైవర్ అత్యాచారానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. హాస్టల్‌లో దూరి గదిలో ఒంటరిగా ఉన్న బీటెక్ విద్యార్థిపై అత్యాచారానికి పాల్పడ్డాడు డ్రైవర్. విషయం తెలిసిన పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని విద్యార్థినిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Heavy Rains: సీఎం చంద్రబాబు వెళ్లొచ్చినా అధికారుల్లో రాని మార్పు

Heavy Rains: సీఎం చంద్రబాబు వెళ్లొచ్చినా అధికారుల్లో రాని మార్పు

భారీ వర్షాలకు బెజవాడ వణికిపోయింది.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇంట్లో నుంచి బయటికి వచ్చేసిన జనాలు ఎంతో మంది ఉంటే.. నీళ్లు, అన్నం పెట్టి కాపాడంటూ మహాప్రభో అంటూ ఇళ్లలో ఇరుక్కుపోయిన ప్రజలు చేతులెత్తి మొక్కుతున్న పరిస్థితి. ఇబ్రహీంపట్నంలోని ఫెర్రి గాజులపేటలో టిఫిన్లు, భోజనాలు లేక వరద బాధితులు అల్లాడుతున్నారు. విషయం తెలుసుకుని చలించిపోయిన సీఎం నారా చంద్రబాబు ఆ ప్రాంతానికి వెళ్లి పరామర్శించి..

NTTPS Accident: ఎన్టీటీపీఎస్ ప్రమాదంపై విచారణ చేస్తాం: మంత్రి వాసంశెట్టి..

NTTPS Accident: ఎన్టీటీపీఎస్ ప్రమాదంపై విచారణ చేస్తాం: మంత్రి వాసంశెట్టి..

ఇబ్రహీంపట్నం ఎన్టీటీపీఎస్‌ (NTTPS)లో ఇవాళ (మంగళవారం) అర్ధరాత్రి బాయిలర్ నుంచి మంటలు(Boiler Explosion) చెలరేగి గాయపడిన ఇద్దరు కార్మికులను కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాశ్ (Minister Vasamshetty Subhash), మాజీ మంత్రి దేవినేని ఉమా(Devineni Uma) పరామర్శించారు. అర్ధరాత్రి సమయంలో ఎన్టీటీపీఎస్ ఐదో దశలో బాయిలర్ ఆగిపోవడంతో కార్మికులు మరమ్మతులు చేపట్టారు. ఆ సమయంలో బూడిద నిల్వ తలుపులు ఒక్కసారిగా తెరుచుకున్నాయి. దీంతో మంటలు చేలరేగి ఓ ఉద్యోగి, మరో కాంట్రాక్టు కార్మికుడికి తీవ్రగాయాలయ్యాయి.

Boiler Explosion: వరస బాయిలర్ పేలుడు ఘటనలతో దద్దరిల్లుతున్న ఎన్టీఆర్ జిల్లా..

Boiler Explosion: వరస బాయిలర్ పేలుడు ఘటనలతో దద్దరిల్లుతున్న ఎన్టీఆర్ జిల్లా..

వరస బాయిలర్ పేలుడు(Boiler Explosion) ఘటనలతో ఎన్టీఆర్ జిల్లా(NTR District) దద్దరిల్లుతోంది. జగ్గయ్యపేట మండలం బూదవాడ వద్ద అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారంలో బాయిలర్ పేలుడు ఘటన మరవకముందే ఇబ్రహీంపట్నం(Ibrahimpatnam)లో మరో ప్రమాదం వెలుగు చూసింది. నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (NTTPS) ఐదవ యూనిట్ బాయిలర్‌లో మరమ్మతులు చేస్తుండగా ఒక్కసారిగా మంటలు రావడంతో ఇద్దరు కార్మికులకు తీవ్రగాయాలు అయ్యాయి.

Loose Petrol.. ఎన్టీఆర్ జిల్లా: లూజ్ పెట్రోల్  నిలిపివేత

Loose Petrol.. ఎన్టీఆర్ జిల్లా: లూజ్ పెట్రోల్ నిలిపివేత

ఇబ్రహీంపట్నం, (ఎన్టీఆర్ జిల్లా): రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్లు దృష్టిలో పెట్టుకుని, ఇబ్రహీంపట్నంలో జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు ఉండటంతో పెట్రోల్ బంక్‌లలో లూజ్ పెట్రోల్ పోయడాన్ని పోలీసులు నిలిపివేశారు. ఈసీ ఆదేశాల మేరకు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పెట్రోల్ బంకుల యాజమాన్యంతో పోలీసులు సమావేశం ఏర్పాటు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి