Home » Himanta Biswa Sarma
అస్సాం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ మేనిఫెస్టోను బీజేపీ మంగళవారంనాడు విడుదల చేసింది. బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే మూడు నెలల్లోపు ఉమ్మడి పౌర స్మృతి అమలు చేస్తామని భరోసా ఇచ్చింది.
అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 88 మంది అభ్యర్థుల తొలి జాబితాను భారతీయ జనతా పార్టీ గురువారంనాడు విడుదల చేసింది. జలుక్బారీ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ పోటీ చేస్తున్నారు.
అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే భాగస్వాముల మధ్య సీట్ల పంపకాల ఫార్ములాను ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ వెల్లడించారు. బీజేపీ 89 సీట్లలో, భాగస్వామ్య పక్షాలైన అసోం గణ పరిషత్ 26 స్థానాల్లో, బోడోల్యాండ్ పీపుల్స్ ఫ్రంట్ 11 సీట్లలో పోటీ చేయనున్నట్టు చెప్పారు.
అస్సాం అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎన్డీయే కూటమిలో సీట్ల పంపకాల ప్రక్రియ పూర్తయినట్టు ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ ఆదివారంనాడు తెలిపారు. త్వరలోనే అభ్యర్థుల జాబితాతో అమిత్షాను కలుస్తామని చెప్పారు.
గొగోయ్ పాకిస్థాన్ ఏజెంట్ అంటూ సీఎం చేసిన ఆరోపణలపై ఆసక్తికరమైన సర్వే జరిగింది. ఈనెల 13, 14 తేదీల్లో జరిగిన ఈ సర్వేలో మెజారిటీ అస్సాం ఓటర్లు సీఎం ఆరోపణలను విశ్వసించడం లేదని వెల్లడైంది.
కాంగ్రెస్ నేతలపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ రూ.500 కోట్ల పరువునష్టం దావా వేశారు. తన పరువుకు నష్టం కలిగించే ఆరోపణలు చేశారని సీఎం పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కుటుంబంపై భూముల ఆరోపణలున్నాయని, వాటి నుంచి దారి మళ్లించేందుకే తమపై ఆయన వివాదాలు సృష్టిస్తున్నారని గౌహతిలో మీడియాతో మాట్లాడుతూ గౌరవ్ గొగోయ్ చెప్పారు.
పాకిస్థాన్తో కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్కు ఉన్న సంబంధాలపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంపై ఆయనను తమ ప్రభుత్వం అరెస్టు చేయాలనుకోవడం లేదని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన తాజా సమాచారం ప్రకారం, 20 జిల్లాల్లోని 56 రెవెన్యూ సర్కిల్స్, 764 గ్రామాల్లో 3,64,046 మంది వరద గుప్పిట్లో చిక్కుకున్నారు. కాఛార్ జిల్లాలో ఈ ప్రభావం చాలా ఎక్కువగా ఉంది.
కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ ఐఎస్ఐతో సన్నిహితంగా వ్యవహరించారంటూ అసోం ముఖ్యమంత్రి హిమంత్ బిస్వ శర్మ చేసిన సంచలన ఆరోపణలు వ్యవహారం మరింత ముదురుతోంది. తాజాగా తన వాదనను హిమంత్ బిస్వ శర్మ మరింత బలంగా వినిపించారు.