Home » Himanta Biswa Sarma
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన తాజా సమాచారం ప్రకారం, 20 జిల్లాల్లోని 56 రెవెన్యూ సర్కిల్స్, 764 గ్రామాల్లో 3,64,046 మంది వరద గుప్పిట్లో చిక్కుకున్నారు. కాఛార్ జిల్లాలో ఈ ప్రభావం చాలా ఎక్కువగా ఉంది.
కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ ఐఎస్ఐతో సన్నిహితంగా వ్యవహరించారంటూ అసోం ముఖ్యమంత్రి హిమంత్ బిస్వ శర్మ చేసిన సంచలన ఆరోపణలు వ్యవహారం మరింత ముదురుతోంది. తాజాగా తన వాదనను హిమంత్ బిస్వ శర్మ మరింత బలంగా వినిపించారు.
పాక్ ఉగ్రవాదాన్ని ప్రపంచ దేశాల ముందుకు తెచ్చేందుకు విదేశాలకు వెళ్తున్న ఎంపీల బృందంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదిత నలుగురు ఎంపీల్లో ఒకరైన గౌరవ్ గొగోయ్పై ఆసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు.
గ్రదాడులు జరిగిన రోజు రాత్రిని ఎప్పటికీ మరచిపోలేనని, ఎన్ఎస్జీ ఆపరేషన్ ఇప్పటికీ తన కళ్ల ముందు ఉందని సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో హిమంత బిశ్వా శర్మ తెలిపారు.
డిబ్రూగఢ్ జర్నీలో ఈరోజు ఎంతో ప్రాధాన్యత కలిగిన రోజని, అసోం రెండవ రాజధానిగా డిబ్రూగఢ్ నిలువ నుందని, చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఈ నగరంలో రిపబ్లిక్ డే వేడుకలు జరగడం ఇదే మొదటిసారని అసోం సీఎం చెప్పారు
దేవాలయాల దగ్గర గొడ్డుమాంసం తినడాన్ని నిలిపివేయాలని తమ ప్రభుత్వం గతంలో నిర్ణయం తీసుకుందని, ఇప్పుడు ఆ నిషేధాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రెస్టారెంట్లు, హోటళ్లు, బహిరంగ ప్రదేశాలకు విస్తరించాలని నిర్ణయించామని హిమంత బిశ్వ శర్మ తెలిపారు.
పేరు మార్పునకు అసోం క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నట్టు ముఖ్యమంత్రి శర్మ మంగళవారంనాడు ప్రకటించారు. కొద్దికాలంగా రాష్ట్రంలోని పలు గ్రామాల పేర్లను రాష్ట్ర ప్రభుత్వం మార్పుచేసింది.
అక్రమ వలసలను అరికట్టడంలో భాగంగానే ఇక నుంచి ఆధార్ కార్డుల జారీ విషయంలో కఠినంగా వ్యవహరించాలని తమ ప్రభుత్వం నిర్ణయించినట్టు అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తెలిపారు.
అసోంలో భారీ ఆర్థిక కుంభకోణం వెలుగు చూసింది. ఇద్దరు యువకులు కలిసి చేసిన రూ.2 వేల 200కోట్ల ఘరానా మోసం గుట్టు రట్టు చేశారు అసోం పోలీసులు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దిబ్రూఘర్కు చెందిన విశాల్(22), గువహాటికి చెందిన స్వప్నిల్ దాస్ ఇరువురు స్నేహితులు.
అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర అసెంబ్లీలో ప్రతి శుక్రవారం రెండు గంటల పాటు ఇచ్చే నమాజ్ విరామాన్ని రద్దు చేస్తున్నట్టు శుక్రవారంనాడు శాసనసభలో ప్రకటించారు. సభా కార్యక్రమాల ప్రొడక్టివిటీని పెంచడంతో పాటు వలస కాలం నాటి పద్ధతులను తొలగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు అభివర్ణించారు.