Home » Assam
అస్సాం గత పదేళ్లుగా గణనీయమైన అభివృద్ధిని సాధించిందని, బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేను మరోసారి రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించేందుకు సిద్ధంగా ఉన్నారనే నమ్మకం తనకు ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.
అస్సాం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ మేనిఫెస్టోను బీజేపీ మంగళవారంనాడు విడుదల చేసింది. బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే మూడు నెలల్లోపు ఉమ్మడి పౌర స్మృతి అమలు చేస్తామని భరోసా ఇచ్చింది.
క్షేత్ర స్థాయిలో ప్రజలతో మమేకమై ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులపై ప్రజలకు అవగాహన కల్పించడంపై దృష్టి పెట్టాలని, బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని బీజేపీ కార్యకర్తలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దిశానిర్దేశం చేశారు.
అస్సాంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మహిళలకు నెలవారీ నగదు బదిలీతో పాటు, వారు వ్యాపారం చేసుకునేందుకు, వ్యాపార విస్తరణకు అదనంగా రూ.50,000 సాయం చేస్తామని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రకటించారు.
పాకిస్థాన్కు గూఢచర్యం చేస్తున్నట్లు వచ్చిన ఆరోపణలపై భారత వాయుసేనలో ఓ ఉద్యోగిని రాజస్థాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడికి పాక్ హ్యాండ్లర్లతో విస్తృత పరిచయాలు ఉన్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది.
అస్సాంలోని తిన్సుకియా జిల్లాలోని అస్సాం పోలీసు కమాండో క్యాంప్పై ఆదివారం తెల్లవారు జామున మిలిటెంట్ దాడి జరిగింది. ఈ దాడిలో నలుగురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. జగున్ ఏరియాలో జరిగిన ఈదాడికి తామే బాధ్యులమని నిషేధిత యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోం-ఇండిపెండెంట్ ప్రకటించింది.
అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 100 సీట్లలో పోటీ చేస్తోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గౌరవ్ గొగోయ్ తెలిపారు. ఐదు పార్టీలతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నట్టు చెప్పారు.
అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 88 మంది అభ్యర్థుల తొలి జాబితాను భారతీయ జనతా పార్టీ గురువారంనాడు విడుదల చేసింది. జలుక్బారీ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ పోటీ చేస్తున్నారు.
అస్సాంలో మరో 20 రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న వేళ కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ లోక్సభ ఎంపీ ప్రద్యుత్ బోర్డోలోయ్ భారతీయ జనతా పార్టీలో బుధవారంనాడు చేరారు.
అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే భాగస్వాముల మధ్య సీట్ల పంపకాల ఫార్ములాను ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ వెల్లడించారు. బీజేపీ 89 సీట్లలో, భాగస్వామ్య పక్షాలైన అసోం గణ పరిషత్ 26 స్థానాల్లో, బోడోల్యాండ్ పీపుల్స్ ఫ్రంట్ 11 సీట్లలో పోటీ చేయనున్నట్టు చెప్పారు.