Home » Alla Rama Krishna Reddy
వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణా రెడ్డికి ఏపీ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో వైసీపీ నేత దాఖలు చేసిన మూడు పిటిషన్లను ధర్మాసనం కొట్టివేసింది.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై జగన్ హయాంలో ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసును సీబీఐకు బదలాయించాలని మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన పిటిషన్పై ఏపీ హైకోర్టులో ఈరోజు(సోమవారం) విచారణ జరిగింది.
ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమాల కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఏసీబీ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నిందితులుగా అప్పటి ప్రతిపక్షనేత, ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారాయణ ఇతరులు ఉన్న విషయం తెలిసిందే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో తమపై నమోదైన కేసును కొట్టివేయాలని సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ.. ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లపై సోమవారం న్యాయస్థానంలో విచారణ జరిగింది.
ఓటుకు నోటు కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబును నిందితుడిగా చేర్చాలని కోరుతూ పిటిషన్ వేసిన వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి శ్రీకారం చుట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని అడుగడుగునా అడ్డుకోవాలని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైయస్ జగన్ ప్రయత్నిస్తున్నారని మాజీమంత్రి జవహర్ ఆరోపించారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబుపై బురద జల్లాలని ఆ పార్టీ నేతలు విశ్వప్రయత్నాలు చేశారని విమర్శించారు.
ఇక్కడి టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ కార్యకర్తలు, రౌడీ షీటర్లు జరిపిన దాడిపై రెండున్నర సంవత్సరాల తర్వాత దర్యాప్తు మొదలైంది.
ఋషికొండపై జనం సొమ్ముతో జగన్ జల్సా మహల్ నిర్మించుకున్నారు. ఇక్కడ విజయవాడ సమీపంలో గుంటూరు జిల్లా ఉండవల్లిలో రెండు ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని లీజు పేరుతో కొట్టేసే ప్రయత్నం జరిగింది. జగన్ పాలనలో అడ్డగోలు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. పార్టీ కార్యాలయాల కోసం జిల్లాల వ్యాప్తంగా ప్రభుత్వ స్థలాలు నామ మాత్రపు లీజుతో కొట్టిసిన వైనం.
ముచ్చటగా మూడోసారి మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీ జెండా రెపరెపలాడుతుందా? అంటే సందేహమేననే ఓ చర్చ అయితే నియోజకవర్గంలో హల్చల్ చేస్తోంది. వరుసగా జరిగిన గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి బరిలో దిగి.. గెలిచారు. కానీ ఈ సారి నియోజకవర్గంలో ఆ పార్టీకి ప్రతికూల ఉన్నాయనే ప్రచారం నడుస్తుంది.
న్యూఢిల్లీ: ఓటుకు నోటు కేసుపై సుప్రీంకోర్టులో ఇక వాయిదాలు ఉండవని, తడుపరి విచారణ జులై 24న చేపడతామన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులను మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి స్వాగతించారు.