ఈతకు వెళ్లి ఓ యువకుడు మృతిచెందిన విషాద సంఘటన తిరుపతి జిల్లా వాకాడు మండలంలో చోటుచేసుకుంది. ఈశ్వరయ్య అనే యుకుడు మహాలక్ష్మమ్మ దేవాలయం పక్కన ఉన్న గుంటలో ఈత కొట్టేందుకు దిగాడు. అక్కడే నీటిలో మునిగి మృతిచెందాడు. దీంతో ఆయన కుటుంబంలో విషాదం నెలకొంది.
సైబర్ నేరగాళ్లు మరో మోసానికి తెరలేపారు. ప్రముఖ సంస్థల పేర్లు వాడుకుంటూ.. ఆఫర్లు ఉన్నాయంటూ మోసాలకు పాల్పడుతున్నారు. నగరంలో ప్రతిరోజూ ఎవరో ఒకరు ఈ సైటర్ మోసగాళ్ల చేతిలో బలవుతూనే ఉన్నారు. లక్షలాది రూపాయలను పొగొట్టుకుంటూనే ఉన్నారు.
పెంచుకుంటున్న ఆవు మృతి చెందడంతో.. తట్టుకోలేక ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన తమిళనాడు రాష్ట్రం విరుదునగర్ జిల్లాలో చోటుచేసుకుంది. సెంథిల్కుమార్ అనే విద్యార్థి కుటుంబం ఆవును పెంచుకుంటోంది. అయితే... రెండురోజుల క్రితం అతి మృతిచెందడం.. అతడ్ని బాగా దాగాలుకు గురిచేసింది. అనంతరం అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
హైదరాబాద్ నగరం సైబర్ మోసాలకు అడ్డాగా మారిందనే విమర్శలొస్తున్నాయి. ప్రతిరోజూ ఎక్కడో ఓ చోట ఈ మోసాలకు ఎవరో ఒకరు బలవుతూనే ఉన్నారు. తాజాగా ఓ మహిళ రూ.29.5 లక్షలను పోగొట్టుకుంది. ఇందకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
కిడ్నీ రాకెట్ కేసులో.. గ్లోబల్ ఆసుపత్రిని పోలీసులు సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రితోని ఆపరేషన్ థియేటర్, ఆపరేషన్కు ఉపయోగించిన పరికరాలు, మందులను స్వాధీనం చేసుకున్నారు. కిడ్నీ రాకెట్ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ పెద్దలు కూడా దీనిపై సీరియస్ అయినట్లు సమాచారం.
యూకేలో డాక్టర్ గా పనిచేస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మహిళను మోసం చేసిన వ్యక్తి ఉదంతం ఒకటి వెలుగులోకి వచ్చింది. సదరు వ్యక్తి ఆ మహిళ నమ్మించి రూ.3.38 లక్షలకు వసూలు చేశాడు. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
హైదరాబాద్కు చెందిన పలువురిని సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టించి లక్షలాది రూపాయలను కొట్టేసిన విషయం వెలుగులోకి వచ్చింది. మొత్తం రూ.8.24 లక్షలను కొల్లగొట్టారు. తమ ఖాతాల్లో ఉన్న నగదు మాయం కావడంతో ఖాతాదారులు లబోదిబోమంటున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
హైటెక్ యుగంలోకూడా ఈ మూడనమ్మకాల జాడ్యం వదలడంలేదు. చేతబడి చేశాడన్న అనుమానంతో ఓ వ్యక్తిని దారుణంగా కొట్టి హతమార్యారు. ఈ సంఘటన ఉస్మానియా యూనివర్సిటీ సిటీ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉనకనాయి.
పొగమంచు... నిండు ప్రాణాలను బలిగొన్నది. కారులో వెళ్తున్న వారికి పొగమంచు కారణంగా రోడ్డు కనబడకపోవడంతో ప్రమాదానికి గురయ్యారు. దీంతో భార్యాభర్తలిద్దరూ మృతిచెందారు. కాగా.. వారి మరణంతో కుటుంబం శోకసముద్రంలో మునిగిపోగా చిన్నారులిద్దరూ అనాథలుగా మిగిలిపోయారు.
హైదరాబాద్ నగరంలో అత్యంత ఖరీదైన ఏరియాల్లో ఒకటైన జూబ్లీహిల్స్లో కోట్లాది రూపాయల విలువూన స్థలాన్ని కబ్జా చేసేందుకు ఓ సినీ నిర్మాత యత్నించిన విషయం వెలుగులోకి వచ్చింది. అయితే.. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.