రైతుల కోసం ఆందోళనలు..: జగన్
ABN, Publish Date - Jun 11 , 2025 | 01:57 PM
YS Jagan: రాష్ట్రంలోని రైతాంగ సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నామని, ఏ రైతు చూసినా తక్కువ ధరలకు తమ పంటలను అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని జగన్ అన్నారు. వరి, మిర్చి, పొగాకు పంటలు చూసినా గిట్టుబాటు ధర లేదన్నారు.
Prakasam Dist: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి (Ex CM Jaganmohan Reddy) బుధవారం ప్రకాశం జిల్లా (Prakasam Dist), పొదిలి (Podili)లో పర్యటించారు. పొగాకు వేలం కేంద్రం వద్ద రైతుల (Farmers)ను పరామర్శించి వారితో మాట్లాడారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రభుత్వం రైతులను పట్టించుకునే పరిస్థితి లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఈ జిల్లాలో ఇద్దరు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, కొండపి, పర్చూరులో గిట్టుబాటు ధరలు లేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని అన్నారు.
రైతాంగ సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నామని, ఏ రైతు చూసినా తక్కువ ధరలకు తమ పంటలను అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని జగన్ అన్నారు. వరి, మిర్చి, పొగాకు పంటలు చూసినా గిట్టుబాటు ధర లేదన్నారు. రైతులను ప్రభుత్వం పట్టించుకోకపోతే మాత్రం కచ్చితంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని, రైతుల పక్షాన వైసీపీ పోరాడుతుందని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో ప్లే చేయండి.
మరిన్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Jun 11 , 2025 | 01:57 PM