సామాన్యుడిలా ఆటోలో వచ్చిన సీఎం చంద్రబాబు..

ABN, Publish Date - Aug 01 , 2025 | 07:42 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సామాన్యుడిలాగా ఆటోలో ప్రయాణించారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. శుక్రవారం వైఎస్ఆర్ కడప జిల్లాలో పర్యటించారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సామాన్యుడిలాగా ఆటోలో ప్రయాణించారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. శుక్రవారం వైఎస్ఆర్ కడప జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా జమ్మలమడుగు మండలం, గూడెం చెరువు గ్రామంలో ఉల్సాల అలివేలమ్మ లబ్ధిదారు ఇంటికెళ్లి వితంతు పెన్షన్‌ను సీఎం చంద్రబాబు అందించారు. అనంతరం ఆమె కుటుంబ సభ్యులతో సీఎం కాసేపు మాట్లాడారు.

ఈ సందర్భంగా వారి సమస్యలు ఆయన అడిగి తెలుసుకున్నారు. ఆమె పెద్ద కుమారుడు వేణుగోపాల్‌కు చెందిన చేనేత మగ్గాన్ని ఈ సందర్భంగా సీఎం పరిశీలించారు. ఒకటో తరగతి చదవుతున్న తన ఆరేళ్ల కుమారుడు హర్షవర్థన్‌కు తల్లికి వందనం కింద లబ్ధి చేకూరిందని సీఎంకు వేణుగోపాల్ తెలిపారు. అనంతరం అలివేలమ్మ చిన్న కుమారుడు, ఆటోడ్రైవర్ జగదీష్‌తో మాట్లాడారు. అదే ఆటోలో సీఎం చంద్రబాబు వేదిక వరకు ప్రయాణించారు.

ఈ వీడియోలు కూడా చూడండి..

అత్యాచారం కేసులో ప్రజ్వల్ రేవణ్ణ కు శిక్ష ఖరారు చేయనున్న కోర్టు

కాళేశ్వరం కమిషన్ నివేదికపై కమిటీ ఏర్పాటు

మరిన్నీ వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Aug 01 , 2025 | 07:42 PM