Nizamabad: ఆన్లైన్ గేమ్లో డబ్బులు పోగొట్టుకుని.. ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య
ABN , Publish Date - May 15 , 2025 | 04:52 AM
ఆన్లైన్ గేమ్లో డబ్బులు పోగొట్టుకొని మనస్తాపానికి గురెన ఓ యువకుడు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన నిజామాబాద్ జిల్లాలో మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది.

కోటగిరి, మే 14 (ఆంధ్రజ్యోతి) : ఆన్లైన్ గేమ్లో డబ్బులు పోగొట్టుకొని మనస్తాపానికి గురెన ఓ యువకుడు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన నిజామాబాద్ జిల్లాలో మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. జిల్లాలోని రుద్రూరు మండలం రాయకూర్ గ్రామానికి చెందిన గంగాధర్(20) సెల్ఫోన్లో ఆన్లైన్ గేమ్లకు అలవాటు పడ్డాడు. మంగళవారం తన తండ్రి పోశెట్టి సెల్ నుంచి 5 వేల రూపాయలు తన ఫోన్కు పంపుకొని ఆన్లైన్ గేమ్లు ఆడాడు. డబ్బులు పోవడంతో తండ్రి కోప్పడతాడేమోనని గ్రామ శివారులో గల చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.