Share News

Medchal: ఒంటరి మహిళ దారుణ హత్య

ABN , Publish Date - May 17 , 2025 | 03:59 AM

ఒంటరిగా అద్దె ఇంట్లో ఉంటున్న ఓ మహిళను దుండగులు కిరాతకంగా హతమార్చారు. ముక్కు, చెవి, గొంతు కోసి హతమార్చి మృతదేహానికి నిప్పంటించి పారిపోయారు.

Medchal: ఒంటరి మహిళ దారుణ హత్య

మేడ్చల్‌ టౌన్‌, మే 16 (ఆంధ్రజ్యోతి): ఒంటరిగా అద్దె ఇంట్లో ఉంటున్న ఓ మహిళను దుండగులు కిరాతకంగా హతమార్చారు. ముక్కు, చెవి, గొంతు కోసి హతమార్చి మృతదేహానికి నిప్పంటించి పారిపోయారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం వికారాబాద్‌కు చెందిన దాసరి లలిత అలియాస్‌ లక్ష్మి(50) మేడ్చల్‌ మునిసిపల్‌ పరిధిలోని వెంకటరమణ వైన్‌షాపులో స్వీపర్‌గా పని చేస్తూ అత్వేల్లిలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటోంది.


గురువారం తెల్లవారుజామున లక్ష్మి గది నుంచి పొగలు రావటం గమనించిన ఇంటి యజమాని అనుమానంతో గదిలోకి వెళ్లాడు. లక్ష్మి మృతదేహం కాలుతున్న స్థితిలో కనిపించడంతో పోలీసులకు సమాచారమిచ్చాడు. పోలీసులొచ్చి ఘటనాస్థలిని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించి కేసు నమోదు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

Vamsi Remand News: వంశీకి రిమాండ్‌లో మరో రిమాండ్

Minister Lokesh: రెన్యూవబుల్ పరిశ్రమ మాత్రమే కాదు.. ఉద్యమం

Liquor Scam Arrests: ఏపీ లిక్కర్‌ స్కాంలో మరిన్ని అరెస్ట్‌లు.. జోరుగా చర్చ

Amaravati: ప్రమాదకరంగా అమరావతి కరకట్ట రోడ్డు

For More AP News and Telugu News

Updated Date - May 17 , 2025 | 03:59 AM