Weather Alert: తెలంగాణ ప్రజలకు అలర్ట్.. నేటి నుంచి 3 రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు
ABN , Publish Date - May 28 , 2025 | 02:39 PM
Weather Alert To Telangana: జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

దేశ ప్రజలకు షాక్ ఇచ్చేలా వర్షాకాలం ఊహించని విధంగా ముందుగానే వచ్చేసింది. గత కొద్దిరోజుల నుంచి దేశ వ్యాప్తంగా మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే నైరుతి రుతుపవనాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నేటి నుంచి రానున్న మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
ఈదురు గాలులు వీస్తూ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ రోజు జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగతా అన్ని జిల్లాల్లో సాధారణం నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. రేపు ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఈ మేరకు ఆ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఇవి కూడా చదవండి
మీ భర్త తక్కువగా మాట్లాడతారా.. కారణం ఇదే..
మామిడి పండ్లను ఫ్రిజ్లో ఉంచుతున్నారా.. ఈ విషయాలను గుర్తుంచుకోండి..