Share News

Bandi Sanjay: బండి సంజయ్‌ ఆదేశాలతో కశ్మీర్‌లోని తెలుగు విద్యార్థులు సురక్షిత ప్రాంతాలకు

ABN , Publish Date - May 11 , 2025 | 04:59 AM

పాక్‌తో ఉద్రిక్తతల వేళ జమ్మూ కాశ్మీర్‌లోని షేర్‌-ఇ-కాశ్మీరీ వ్యవసాయ విజ్ఞాన సాంకేతిక విశ్వవిద్యాలయం(ఎ్‌సకేయూఏఎ్‌సటీ)లో చదువుతున్న తెలుగు విద్యార్థులు తమను ఆదుకోవాలంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కు లేఖ రాశారు.

Bandi Sanjay: బండి సంజయ్‌ ఆదేశాలతో కశ్మీర్‌లోని తెలుగు విద్యార్థులు సురక్షిత ప్రాంతాలకు

న్యూఢిల్లీ, హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌, మే 10(ఆంధ్రజ్యోతి): పాక్‌తో ఉద్రిక్తతల వేళ జమ్మూ కాశ్మీర్‌లోని షేర్‌-ఇ-కాశ్మీరీ వ్యవసాయ విజ్ఞాన సాంకేతిక విశ్వవిద్యాలయం(ఎ్‌సకేయూఏఎ్‌సటీ)లో చదువుతున్న తెలుగు విద్యార్థులు తమను ఆదుకోవాలంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కు లేఖ రాశారు. లేఖ అందుకున్న బండి సంజయ్‌ విద్యార్థులతో నేరుగా ఫోన్లో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిల్లా కలెక్టర్‌, ఎస్‌కేయూఏఎ్‌సటీ వర్సిటీ డీన్‌కు సూచించారు.


అనంతరం అధికారులు విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు చేపట్టారు. 23 మంది విద్యార్థుల్లో తెలంగాణకు చెందినవారు ఆరుగురు, ఏపీకి చెందినవారు ఏడుగురు, తమిళనాడుకు చెందిన 10 మంది విద్యార్థులున్నారు. మరోవైపు జమ్మూ ఐఐటీలో చదువుతున్న హైదరాబాద్‌ విద్యార్థులు శనివారం రాత్రి జమ్ముతావి ఎక్స్‌ప్రెస్‌ రైలులో సికింద్రాబాద్‌కు చేరుకున్నారు.

Updated Date - May 11 , 2025 | 04:59 AM