Share News

Telangana Inter Results: 22న ఇంటర్‌ ఫలితాలు

ABN , Publish Date - Apr 20 , 2025 | 03:30 AM

ఈనెల 22న ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదల కానున్నాయి. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఫలితాలను విడుదల చేస్తారు

Telangana Inter Results: 22న ఇంటర్‌ ఫలితాలు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు ఈనెల 22న విడుదల కానున్నాయి. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యాలయంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఫలితాలను విడుదల చేస్తారని విద్యాశాఖ కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు. విద్యార్థులు తమ ఫలితాలను బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ నుంచి పొందవచ్చన్నారు. మార్చి 5 నుంచి 25 వరకు ఇంటర్‌ పరీక్షలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 9,96,971 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. అందులో 4,88,448 మంది ప్రథమ, 5,08,523 మంది ద్వితీయ సంవత్సర విద్యార్థులున్నారు.


ఇవి కూడా చదవండి..

Betting Apps Case.. మరో ఆరుగురికి నోటీసులు..

కేసీఆర్‌ క్యాంపు కార్యాలయానికి టులెట్‌ బోర్డు..


Read Latest
Telangana News And Telugu News

Updated Date - Apr 20 , 2025 | 03:30 AM