Chintapandu Naveen: కేసీఆర్ హయాంలో వేల ఫోన్లు ట్యాప్ చేశారు
ABN , Publish Date - Jul 18 , 2025 | 04:03 AM
బీఆర్ఎస్ పాలనలో వేల మంది ఫోన్లను ట్యాప్ చేశారని, నాటి సీఎం కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న ఆరోపించారు.

ఎమ్మెల్సీ చింతపండు నవీన్
హైదరాబాద్, జూలై17(ఆంధ్రజ్యోతి): బీఆర్ఎస్ పాలనలో వేల మంది ఫోన్లను ట్యాప్ చేశారని, నాటి సీఎం కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోవడం వల్ల ఈ అరాచకం బయటపడిందని, లేదంటే ఇప్పటికీకొనసాగేదన్నారు. సీఎం రేవంత్ కూడా ఫోన్ ట్యాపింగ్ బాధితుడేనని నవీన్ చెప్పారు. తనతో పాటు తన కుటుంబ సభ్యుల ఫోన్లనూ ట్యాప్ చేశారనిఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి వాగ్మూలం ఇవ్వడానికి తీన్మార్ మల్లన్న సిట్ కార్యాలయానికి వచ్చారు.
ఇవి కూడా చదవండి
స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25లో ఏపీకి ఐదు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు..
యూట్యూబ్లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి