Share News

Sridhar Babu: పదవుల కోసం రాజకీయాల్లోకి రావొద్దు

ABN , Publish Date - May 24 , 2025 | 03:55 AM

పదవుల కోసం రాజకీయాల్లోకి రావొద్దని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా నాగారం మునిసిపల్‌ పరిధి రాంపల్లి దాయరలోని బాలవికాస కేంద్రంలో యూత్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు జరుగుతున్నాయి.

Sridhar Babu: పదవుల కోసం రాజకీయాల్లోకి రావొద్దు

  • ఇందిర కుటుంబం పదవులను ఆశించలేదు: శ్రీధర్‌బాబు

కీసర, మే 23 (ఆంధ్రజ్యోతి): పదవుల కోసం రాజకీయాల్లోకి రావొద్దని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా నాగారం మునిసిపల్‌ పరిధి రాంపల్లి దాయరలోని బాలవికాస కేంద్రంలో యూత్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు జరుగుతున్నాయి. శుక్రవారం రెండో రోజు మంత్రి హాజరై మాట్లాడుతూ.. యువత పదవులు ఆశించి రాజకీయాల్లోకి రావొద్దని సూచించారు. ఇందిరాగాంధీ నుంచి మొదలుకొని నేటి తరం రాహుల్‌గాంధీ వరకు వారి కుటుంబం ఎలాంటి పదవులు ఆశించలేదన్నారు. ఉగ్రవాదం అణచివేతలో ఇందిరాగాంధీ అప్పట్లో తీసుకున్న నిర్ణయం సాహసోపేతమని కొనియాడారు. రాజీవ్‌గాందీ దేశంలో ఐటీ అభివృద్ధికి పునాది వేసిన మహనీయుడని పేర్కొన్నారు. నేడు రాహుల్‌ గాంధీ దేశానికి రోల్‌ మోడల్‌గా నిలిచారని, దేశవ్యాప్తంగా జోడో యాత్ర ద్వారా ప్రజలను చైతన్యవంతుల్ని చేశారన్నారు. ఇప్పుడు వైట్‌ టీషర్ట్‌ కార్యక్రమం చేపట్టి కరుణ, ఐక్యత, అహింస, సమానత్వం, పురోగతి అనే అంశాలపై యువజన కాంగ్రె్‌సకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.


నాస్కామ్‌తో ఉన్నత విద్యా మండలి ఒప్పందం

హైదరాబాద్‌, మే23(ఆంధ్రజ్యోతి):తెలంగాణ ఉన్న త విద్యామండలి పరిధిలోని అన్ని విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో విద్యార్ధుల నైపుణ్యాలను పెంపొందించే విధంగా నాస్కామ్‌ (నేషనల్‌ ఆసోసియేషన్‌ ఆఫ్‌ సాఫ్ట్‌వేర్‌ అండ్‌ సర్వీస్‌ కంపెనీ్‌స)తో మంత్రి శ్రీధర్‌బాబు శుక్రవారం అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. నాస్కామ్‌ స్కిల్‌ సెక్టార్‌ కౌన్సిల్‌ శిక్షణతో వృత్తి నైపుణ్యాలు పెంపొందించుకోవడం ద్వారా విద్యార్థులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఆయన వివరించారు.

Updated Date - May 24 , 2025 | 03:55 AM