Share News

Sridhar Babu: తెలంగాణలో అభివృద్ధి పరుగు

ABN , Publish Date - Jun 14 , 2025 | 03:24 AM

సంక్షేమం, అభివృద్ధిలో తెలంగాణ దూసుకుపోతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు అన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలుస్తున్న తెలంగాణలో కలిసి పనిచేసేందుకు ప్రపంచ పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలని కోరారు.

Sridhar Babu: తెలంగాణలో అభివృద్ధి పరుగు

  • పారిశ్రామికవేత్తల ‘గ్లోబల్‌ లీడర్స్‌ సమ్మిట్‌’లో దుద్దిళ్ల

హైదరాబాద్‌, జూన్‌ 13(ఆంధ్రజ్యోతి): సంక్షేమం, అభివృద్ధిలో తెలంగాణ దూసుకుపోతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు అన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలుస్తున్న తెలంగాణలో కలిసి పనిచేసేందుకు ప్రపంచ పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలని కోరారు. తాజ్‌ డెక్కన్‌ హోటల్‌లో ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ కొలాబరేషన్‌(ఐబీసీ) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘గ్లోబల్‌ లీడర్స్‌ సమ్మిట్‌-2025’ సదస్సును మంత్రి ప్రారంభించారు. 25 దేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు పాల్గొన్న ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అనతి కాలంలోనే అన్ని రంగాల్లో తెలంగాణ దూసుకుపోతోందని చెప్పారు.


తెలంగాణ పురోగతిలో భాగస్వాములు కావాలన్నారు. ‘‘రాష్ట్ర జీడీపీ రూ.16.12 లక్షల కోట్లకు చేరింది. 10.1 శాతం వృద్ధి రేటుతో దేశ సగటు (9.9ు)ను దాటేసింది. తలసరి ఆదాయం రూ.3.79 లక్షలు. ఇది దేశ సగటు కంటే 1.8 రెట్లు ఎక్కువ. ఏడాదిన్నర కాలంలోనే రూ.3 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను సేకరించగలిగాం. గత 14 నెలల్లో లైఫ్‌ సైన్సె్‌సలో రూ. 40 వేల కోట్ల పెట్టుబడులను సాధించాం. 2 లక్షల ఉద్యోగాలు సృష్టించాం. రాష్ట్ర జీడీపీలో సేవల రంగం వాటా 66.3 శాతం. దేశంలో ఇది 55 శాతంగా ఉంది. ఇవి అంకెలు కాదు... తెలంగాణ పురోగతికి నిదర్శనాలు. తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అనుకూలతలు, ప్రభుత్వం కల్పిస్తున్న ప్రోత్సాహకాలను మీ దేశంలోని పారిశ్రామికవేత్తలకు వివరించండి. ఇక్కడ పెట్టుబడులు పెట్టేలా వారిని ప్రోత్సహించండి’’ అని ఆయన కోరారు.


ఇవి కూడా చదవండి..

విమాన ప్రమాదం.. 10 నిమిషాల గ్యాప్‌లో ఎస్కేప్.. సుడి బాగుంది!

గుబులు పుట్టించిన మరో ఎయిరిండియా ఫ్లైట్.. 3 గంటలు గాల్లోనే..!

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 14 , 2025 | 03:24 AM