నేటి నుంచి.. స్లాట్ బుకింగ్తోనే రిజిస్ట్రేషన్లు
ABN , Publish Date - Jun 02 , 2025 | 03:37 AM
రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సోమవారం నుంచి రిజిస్ట్రేషన్లకు స్లాట్ బుకింగ్ విధానం అమలులోకి రానుంది. అలాగే, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ప్రజల కు వచ్చే సందేహాల నివృత్తికి కృత్రిమ మేధ(ఏఐ)తో పనిచేసే వాట్సాప్ చాట్బాట్ను కూడా ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువస్తుంది.

రాష్ట్రంలోని అన్ని సబ్రిజిస్ట్రార్ ఆఫీసుల్లో.. రోజుకు 48 స్లాట్లు
అత్యవసర సందర్భాల్లో ఐదు వాకిన్
రిజిస్ట్రేషన్లకు అనుమతి
రిజిస్ట్రేషన్ సేవల్లో వాట్సాప్ చాట్బాట్
82476 23578కు వాట్సాప్ చేస్తే.. ఏఐతో సందేహాల నివృత్తి
రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతానికి ఆధార్
ఈ-సంతకం అధికారులతో మంత్రి పొంగులేటి సమీక్ష
హైదరాబాద్, జూన్ 1(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సోమవారం నుంచి రిజిస్ట్రేషన్లకు స్లాట్ బుకింగ్ విధానం అమలులోకి రానుంది. అలాగే, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ప్రజల కు వచ్చే సందేహాల నివృత్తికి కృత్రిమ మేధ(ఏఐ)తో పనిచేసే వాట్సాప్ చాట్బాట్ను కూడా ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువస్తుంది. 82476 23578 నెంబర్కు సందేహాలను వాట్సాప్ చేస్తే ఏఐ సమాధానం ఇస్తుంది. స్లాట్ బుకింగ్ విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలులోకి తీసుకువస్తున్న నేపథ్యంలో రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్టాంప్లు, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులతో ఆదివారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉండగా ఇప్పటివరకు రెండు విడతల్లో 47 చోట్ల స్లాట్ బుకింగ్ విధానాన్ని అమలు చేశామన్న మంత్రి.. సోమవారం నుంచి మిగిలిన 97 కార్యాలయాల్లో కూడా అమలు చేస్తున్నామని తెలిపారు స్లాట్ బుకింగ్ విధానం అమలులో ఎలాంటి సాంకేతిక సమస్యలు ఎదురుకాకుండా చూడాలని స్పష్టం చేశారు. స్లాట్ బుకింగ్ విధానంపై 94 శాతం ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు. తొలి దశలో 22 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏప్రిల్ 10 నుంచి ఇప్పటివరకు 30,592 డాక్యుమెంట్లు, రెండో దశలో 25 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మే 12 నుంచి ఇప్పటివరకు 14,099 డాక్యుమెంట్లు మొత్తం 45,191 రిజిస్ట్రేషన్లు జరిగాయన్నారు. స్లాట్ బుకింగ్ వల్ల సాధారణం కంటే మూడు వేల డాక్యుమెంట్లు ఎక్కువగా రిజిస్ట్రేషన్ జరిగాయని ఆయన తెలిపారు.
రోజుకి 48 స్లాట్లు, వాట్సాప్ చాట్బాట్
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఉదయం 10.30 గంటల నుంచి సాయింత్రం 5 గంటల వరకు(మధ్యాహ్న భోజన విరామ సమయం మినహాయించి) రిజిస్ట్రేషన్ కోసం ప్రజలు స్లాట్ బుక్ చేసుకోవచ్చునని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. ప్రతి కార్యాలయంలో రోజుకు 48 స్లాట్లు అందుబాటులో ఉంటాయని చెప్పారు. స్లాట్ బుకింగ్ చేసుకోని వారి కోసం.. అత్యవసర సందర్భాల్లో సాయంత్రం 5 నుంచి 5.30 గంటల వరకు ఐదు వాకిన్ రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇచ్చామని తెలిపారు. ఇక, ఏఐ అనుసంధానంతో పని చేసే వాట్సాప్ చాట్బాట్ను అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అందుబాటులోకి తెచ్చామని వెల్లడించారు. రిజిస్ట్రేషన్ చేసుకునే వారు తమ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చునని వివరించారు. రిజిస్ట్రార్ కార్యాలయం లొకేషన్, స్లాట్ బుకింగ్ ఖాళీలు, సమయం, గిఫ్ట్ డీడ్, సేల్ డీడ్పై వసూలు చేసే రుసుములు తదితర వివరాలపై ఏఐ చాట్బాట్ సమాచారం ఇస్తుందని తెలిపారు. అదే విధంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు ఆధార్ ఈ-సంతకం విధానాన్ని ప్రవేశపెడుతున్నామని మంత్రి పొంగులేటి చెప్పారు. తొలుత ఈ విధానాన్ని నిజామాబాద్ జిల్లా ఆర్మూర్, ఖమ్మం జిల్లా కూసుమంచి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నామని క్రమంగా రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు. ఇక, అక్రమాలకు చెక్ పెట్టేలా లేఅవుట్ల్లో డబుల్ రిజిస్ట్రేషన్లు జరగకుండా ఉండేందుకు రిజిస్ట్రేషన్ పూర్తయిన, పూర్తి కాని ప్లాట్ల వివరాలు రిజిస్ట్రేషన్ కార్యాలయం, బిల్డర్, డెవలపర్ దగ్గర ఉండేలా త్వరలో రిజిస్ట్రేషన్ మాడ్యూల్ను తీసుకువస్తామని తెలిపారు. ఈ మాడ్యూల్లో రిజిస్ట్రేషన్ పూర్తయిన ప్లాట్ల వివరాలు ఎర్ర రంగులో కనిపిస్తాయని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. కాగా, స్లాట్ బుకింగ్ విధానం దృష్ట్యా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పనిభారం అధికంగా ఉన్న పఠాన్చెరు, యాదగిరిగుట్ట, గండిపేట, ఇబ్రహీంపట్నం, సూర్యాపేట, జడ్చర్ల, మహబూబ్నగర్, వనపర్తి, గద్వాల్ సహా తొమ్మిది చోట్ల అదనపు సబ్ రిజిస్ట్రార్, సిబ్బందిని నియమించామని ఆయన వివరించారు.
ఇవి కూడా చదవండి
తెలంగాణ లా, ప్రొస్ట్గ్రాడ్యుయేషన్ లా సెట్ అడ్మిట్ కార్డుల విడుదల..
మల విసర్జన చేయడానికి మంచి టైం ఏది.. డాక్టర్లు ఏం చెబుతున్నారు..