Share News

DK Aruna: రాష్ట్రంలో పర్సెంటేజీల పాలన : డీకే అరుణ

ABN , Publish Date - Jun 07 , 2025 | 06:16 AM

రాష్ట్రంలో పర్సెంటేజీల పాలన నడుస్తోందని, 30 శాతం కమీషన్‌ చెల్లిస్తేనే పెండింగ్‌ బిల్లులు వస్తున్నాయని బీజేపీ ఎంపీ డీకే అరుణ తీవ్రంగా విమర్శించారు.

DK Aruna: రాష్ట్రంలో పర్సెంటేజీల పాలన : డీకే అరుణ

హైదరాబాద్‌, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పర్సెంటేజీల పాలన నడుస్తోందని, 30 శాతం కమీషన్‌ చెల్లిస్తేనే పెండింగ్‌ బిల్లులు వస్తున్నాయని బీజేపీ ఎంపీ డీకే అరుణ తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి పనులన్నీ కాగితాలకే పరిమితమయ్యాయని, కాంట్రాక్టర్లు టెండర్లు వేసే పరిస్థితి లేదని ఆరోపించారు. ఐదున్నర గంటల సుదీర్ఘ క్యాబినెట్‌ సమావేశంలో ఏమీ తేల్చలేదని విమర్శించారు. కాగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఖాళీ లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా అరుణ చెప్పారు.


ఇవి కూడా చదవండి

ముదిరిన వివాదం.. శాతవాహన కాలేజ్ నేలమట్టం

చీనాబ్ రైల్వే బ్రిడ్జ్‌పై సీఎం చంద్రబాబు ట్వీట్

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 07 , 2025 | 06:16 AM