RTC JAC: వెల్ఫేర్ కమిటీలతో సమావేశం రద్దు చేయాలి
ABN , Publish Date - May 23 , 2025 | 05:24 AM
ఆర్టీసీలోని వెల్ఫేర్ కమిటీలతో ఈ నెల 27న అధికారులు నిర్వహించబోతున్న సమావేశాన్ని రద్దు చేయాలని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి డిమాండ్ చేశారు.

ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి
హైదరాబాద్, మే 22 (ఆంధ్రజ్యోతి): ఆర్టీసీలోని వెల్ఫేర్ కమిటీలతో ఈ నెల 27న అధికారులు నిర్వహించబోతున్న సమావేశాన్ని రద్దు చేయాలని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి డిమాండ్ చేశారు. వెల్ఫేర్ కమిటీలను అధికారులు తమకు అనుకూలమైన వారితో ఏర్పాటు చేసుకున్నారని, వారు ఉద్యోగుల సమస్యలపై పోరాడే పరిస్థితి లేదని ఆయన అన్నారు. వెల్ఫేర్ కమిటీల రద్దు, ఆర్టీసీలో యూనియన్ల పునరుద్ధరణ వంటి అంశాలపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో ఇటీవల జరిపిన చర్చలో ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు.
కానీ అందుకు భిన్నంగా వెల్ఫేర్ కమిటీ సభ్యులతో చర్చలు జరపాలని అధికారులు నిర్ణయించడం సరైంది కాదని చెప్పారు. ఈ సమావేశం రద్దు చేయాలని, లేదంటే ఎదురయ్యే పరిణామాలకు ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.