RTC: ఆర్టీసీ సీసీఎస్లో 15 రోజుల్లోగా రూ.1,029 కోట్లు జమ చేయాలి
ABN , Publish Date - May 16 , 2025 | 04:05 AM
ఉద్యోగుల వేతనాల నుంచి వసూ లు చేసిన సొమ్ము రూ.1,029 కోట్లు ఆర్టీసీ ఉద్యోగుల క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ (సీసీఎస్) ఖాతాలో జమ చేయనందుకు ముగ్గురు ఉన్నతాధికారులకు ఆర్టీసీ ఉద్యోగుల సంఘం నోటీసులు పంపింది.

యాజమాన్యానికి సంఘం నోటీసు
హైదరాబాద్, మే 15 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగుల వేతనాల నుంచి వసూ లు చేసిన సొమ్ము రూ.1,029 కోట్లు ఆర్టీసీ ఉద్యోగుల క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ (సీసీఎస్) ఖాతాలో జమ చేయనందుకు ముగ్గురు ఉన్నతాధికారులకు ఆర్టీసీ ఉద్యోగుల సంఘం నోటీసులు పంపింది. రాష్ట్ర రవాణాశాఖ ప్రత్యేక కార్యదర్శి వికాస్ రాజు, ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్, ఆర్టీసీ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ విజయ పుష్పలకు ఆ నోటీసులు అందజేసింది.
ఉద్యోగుల కష్టార్జితం సంస్థ ఇతర అవసరాలకు వాడటం నిబంధనలకు పూర్తి విరుద్ధమని స్పష్టం చేసింది. 15 రోజుల్లో రూ.1,029 కోట్లు సీసీఎ్సలో జమ చేయకుంటే న్యాయపరమైన చర్యలు తప్పవని తేల్చి చెప్పింది.