Hyderabad Womans Theft Case: మహిళకు షాకిచ్చిన స్నేహితురాలు.. బాయ్ఫ్రెండ్తో కలిసి పర్సు చోరీ
ABN , Publish Date - May 25 , 2025 | 12:07 PM
తన ఆఫీసుకెళ్లిన సందర్భంలో ఇంట్లోని నగలను స్నేహితురాలు ఆమె బాయ్ ఫ్రెండ్ చోరీ చేశారంటూ ఓ మహిళ ఫిర్యాదు చేసింది. హైదరాబాద్లోని ఎల్లారెడ్డి గూడలో ఈ ఘటన వెలుగు చూసింది.

ఉద్యోగం చేసే ఇద్దరు మహిళలు ఒకే ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. గదిలో బీరువా లేకపోవడంతో ఓ మహిళ తన నగలను పర్సులో పెట్టి పనిమీద వెళ్లిపోయింది. సాయంత్రం ఇంటికి తిరిగొచ్చేసరికి నగలు పర్సు మాయం కావడంతో ఆమె షాకైపోయింది. తనతో పాటు ఉంటున్న మహిళ, ఆమె బాయ్ఫ్రెండ్ కారణమని భావించి చివరకు పోలీసులను ఆశ్రయించింది. నగరంలోని వెంగళరావు నగర్లో ఈ ఘటన చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే..శైలజ అనే మహిళ బంజారాహిల్స్లోని ఓ హోటల్లో పనిచేస్తుంటుంది. ఎల్లారెడ్డిగూడ లోని అద్దె గదిలో ఉంటోంది. శైలజ తోపాటు అదే గదిలో కలిసి ఉంటున్న సౌభాగ్య అనే మరో మహిళ కూడా ఉంటోంది. అద్దె గదిలో బీరువా లేకపోవడంతో శైలజ తన మంగళసూత్రం, చెవి కమ్మలు, గాజులు, చంద్రహారం, నల్లపూసల దండ, కొంత డబ్బును పర్సులో ఉంచి ఉద్యోగానికి ఇటీవల వెళ్ళింది.
ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో సౌభాగ్య తన బాయ్ఫ్రెండ్ను ఇంటికి పిలిపించుంది. ఆ తరువాత సాయంత్రానికి ఇంటికి వచ్చిన శైలజ తన పర్సు కనిపించకపోవడంతో షాకైపోయింది. సౌభాగ్య, ఆమె బాయ్ ఫ్రెండ్లే ఈ చోరీకి పాల్పడి ఉంటారని భావించిన శైలజ చివరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహిళ ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఈ వార్తలు కూడా చదవండి
Sama Ramamohan Reddy: రజతోత్సవ సభ కాదది.. విచ్ఛిన్న సభ!
Hyderabad fire tragedy: హైదరాబాద్ చరిత్రలోనే విషాదకర ఘటన
Read Latest Telangana News And Telugu News