Bhatti Vikramarka: 2న ‘రాజీవ్ యువ వికాసం’ పంపిణీ : భట్టి
ABN , Publish Date - May 29 , 2025 | 03:50 AM
రాజీవ్ యువ వికాసం లబ్ధిదారులకు జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మంజూరు పత్రాలు ఇవ్వనున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.

హైదరాబాద్, మే 28 (ఆంధ్రజ్యోతి): రాజీవ్ యువ వికాసం లబ్ధిదారులకు జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మంజూరు పత్రాలు ఇవ్వనున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. రాజీవ్ యువ వికాసం పథకం అమలుపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి బుధవారం సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాజీవ్ యువ వికాసం అమలుతో వ్యాపార కార్యకలాపాలు విస్తృతంగా సాగుతాయన్నారు.
తద్వారా రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి(జీఎ్సడీపీ) పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అందుకే ఈ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్లను ఆయన ఆదేశించారు. రూ.8 వేల కోట్ల నిధులతో 5 లక్షల మంది యువతకు ఈ పథకం ద్వారా ఉపాధి కల్పిస్తామని భట్టి విక్రమార్క చెప్పారు.
Also Read:
తెలంగాణ హైకోర్టు కొత్త సీజే ఎవరంటే
For More Telangana News and Telugu News..