Share News

రాజన్న గోశాలలో మరో రెండు కోడెలు మృతి

ABN , Publish Date - Jun 07 , 2025 | 03:31 AM

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వరస్వామి తిప్పాపూర్‌ గోశాలలో శుక్రవారం తెల్లవారుజామున మరో 2 కోడెలు మృతి చెందాయి.

రాజన్న గోశాలలో మరో రెండు కోడెలు మృతి

వేములవాడ కల్చరల్‌, జూన్‌ 6(ఆంధ్రజ్యోతి): రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వరస్వామి తిప్పాపూర్‌ గోశాలలో శుక్రవారం తెల్లవారుజామున మరో 2 కోడెలు మృతి చెందాయి. దీంతో ఇప్పటివరకు మృతిచెందిన కోడెల సంఖ్య 31కి చేరింది. మరో 3 కోడెల పరిస్థితి విషమంగా ఉందని జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి విడుదల చేసిన హెల్త్‌ బులెటిన్‌లో తెలిపారు. ప్రస్తుతం 11 కోడెలకు వెటర్నరీ డాక్టర్లు వైద్యం అందిస్తున్నారని, అనారోగ్యంతో ఉన్న కోడెలు కోలుకుంటున్నాయన్నారు.

Updated Date - Jun 07 , 2025 | 03:31 AM