Ponnam Prabhakar: ఎవరెస్ట్ బేస్ క్యాంప్కు ఎంపికైన గురుకుల విద్యార్థులను సత్కరించిన పొన్నం
ABN , Publish Date - May 25 , 2025 | 04:35 AM
మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్లోని అడ్వెంచర్ క్యాంప్ శిక్షణకు ఎంపికైన మహాత్మా జ్యోతిరావు ఫూలే గురుకుల పాఠశాలల విద్యార్థులను మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం ఘనంగా సన్మానించారు.

హైదరాబాద్, మే 24 (ఆంధ్రజ్యోతి): మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్లోని అడ్వెంచర్ క్యాంప్ శిక్షణకు ఎంపికైన మహాత్మా జ్యోతిరావు ఫూలే గురుకుల పాఠశాలల విద్యార్థులను మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం ఘనంగా సన్మానించారు. ఎవరెస్ట్ బేస్ క్యాంప్ సెలక్షన్స్ కోసం గురుకుల పాఠశాలల నుంచి వంద మంది బాలికలు, మరో వందమంది బాలురను ఎంపిక చేసి రెండు రోజుల పాటు భువనగిరిలోని రాక్ క్లైమింగ్లో శిక్షణ ఇప్పించారు.
ఇందులో ప్రతిభ ప్రదర్శించిన 20 మంది విద్యార్థులను అడ్వెంచర్ క్యాంప్కు ఎంపిక చేశారు. వీరు మే 25 నుంచి జూన్ 10 వరకు ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వద్ద ట్రెక్కింగ్ చేయనున్నారు. ఆదివారం ఉదయం విద్యార్థులు బయలుదేరి వెళ్లనున్నారు.
ఇవి కూడా చదవండి
Government Doctor: భార్యను పుట్టింటికి పంపించి.. వేరే మగాళ్లతో ఇంట్లో ఆ వీడియోలు..
Telangana: కవిత చెప్పిన దెయ్యాలు వారే.. సామ సంచలన కామెంట్స్..