Prabhakar Rao: 9న సిట్ ముందుకు ప్రభాకర్ రావు
ABN , Publish Date - Jun 07 , 2025 | 04:40 AM
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్రావుకు అత్యవసర ట్రాన్సిట్ వారెంట్ను అమెరికాలోని భారత ఎంబసీ జారీ చేసింది.

నేడు అమెరికా నుంచి పయనం
హైదరాబాద్. జూన్ 6 (ఆంధ్రజ్యోతి): ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్రావుకు అత్యవసర ట్రాన్సిట్ వారెంట్ను అమెరికాలోని భారత ఎంబసీ జారీ చేసింది. పాస్పోర్ట్ను రద్దు చేయడంతో సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆయన అత్యవసర ట్రాన్సిట్ వారెంట్కు దరఖాస్తు చేసుకున్నారు. 7వ తేదీన భారత్కు బయలుదేరి ఈ నెల 8న అర్ధరాత్రి హైదరాబాద్కు చేరుకోనున్నారు. ప్రభాకర్రావు 9న ఉదయం సిట్ ఎదుట హాజరుకానున్నారు.