Share News

Manda Krishna Madiga: ఉద్యమాలకు దక్కిన గుర్తింపు ‘పద్మశ్రీ’

ABN , Publish Date - May 29 , 2025 | 04:35 AM

కేంద్ర ప్రభుత్వం తనకు ఇచ్చిన పద్మశ్రీ పురస్కారాన్ని ఉద్యమాలకు దక్కిన గుర్తింపుగా భావిస్తున్నానని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ అన్నారు.

Manda Krishna Madiga: ఉద్యమాలకు దక్కిన గుర్తింపు ‘పద్మశ్రీ’

  • ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ

న్యూఢిల్లీ, మే 28 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం తనకు ఇచ్చిన పద్మశ్రీ పురస్కారాన్ని ఉద్యమాలకు దక్కిన గుర్తింపుగా భావిస్తున్నానని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ఎమ్మార్పీఎస్‌ ఉద్యమానికి, శ్రేణులకు దక్కిన గౌరవంగా అభివర్ణించారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.


లక్ష్యం కోసం పని చేస్తే గుర్తింపు, గౌరవం వస్తుందనడానికి తనకు వచ్చిన పద్మశ్రీ పురస్కారమే నిదర్శనమన్నారు. ఎస్సీ వర్గీకరణకు కృషి చేసిన ప్రధాని మోదీ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఏపీ సీఎం చంద్రబాబుతో సహా మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి మందకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - May 30 , 2025 | 02:55 PM