PJTSAU: వెస్టర్న్ సిడ్నీ వర్సిటీతో కొత్త విద్యా కోర్సులు
ABN , Publish Date - May 12 , 2025 | 05:29 AM
విద్యార్థులు నాలుగేళ్ల కోర్సు వ్యవధిలో మూడేళ్లు పీజేటీఏయూలోనూ, ఒక ఏడాది వెస్టర్న్ సిడ్నీ విశ్వవిద్యాలయంలో విద్య అభ్యసిస్తారు. తద్వారా రెండు విశ్వవిద్యాలయాల్లోనూ విద్యనభ్యసించే అవకాశం విద్యార్థులకు కలుగుతుంది.

జయశంకర్ వ్యవసాయ వర్సిటీ వీసీ జానయ్య
హైదరాబాద్, రాజేంద్రనగర్, మే 11 (ఆంధ్రజ్యోతి): ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (పీజేటీఎ్సఏయూ)లో రెగ్యులర్గా ఉన్న బీఎస్సీ (అగ్రికల్చర్), కమ్యూనిటీ సైన్స్, ఫుడ్ సైన్స్ టెక్నాలజీ, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కోర్సులకు అదనంగా 2025- 26 విద్యా సంవత్సరం నుంచి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆస్ట్రేలియాలోని వెస్టర్న్ సిడ్నీ విశ్వవిద్యాలయం(డబ్ల్యుఎ్సయూ)తో కలసి బీఎస్సీ వ్యవసాయ డిగ్రీ కోర్సును ప్రారంభించనుంది. విద్యార్థులు నాలుగేళ్ల కోర్సు వ్యవధిలో మూడేళ్లు పీజేటీఏయూలోనూ, ఒక ఏడాది వెస్టర్న్ సిడ్నీ విశ్వవిద్యాలయంలో విద్య అభ్యసిస్తారు. తద్వారా రెండు విశ్వవిద్యాలయాల్లోనూ విద్యనభ్యసించే అవకాశం విద్యార్థులకు కలుగుతుంది.
అదే విధంగా విద్యార్థులు ఎమ్మెస్సీ కూడా చదవాలని భావిస్తే మరో ఏడాది వెస్టర్న్ సిడ్నీ వర్సిటీలో చదువాల్సి ఉంటుంది. తద్వారా బీఎస్సీ డిగ్రీ పీజేటీఏయూ నుంచి, ఎమ్మెస్సీ డిగ్రీ వెస్టర్న్ సిడ్నీ వర్సిటీ నుంచి పొందే అవకాశం ఉంటుంది. ఆసక్తి ఉన్న విద్యార్థులు పీజీ తర్వాత కూడా వెస్టర్న్ సిడ్నీ వర్సిటీలో స్కాలర్షిప్ సాయంతో పీహెచ్డీ పూర్తి చేయొచ్చు. ఈ అంశాలపై రెండు వర్సిటీల మధ్య ఒప్పందం కుదిరే ప్రక్రియ తుది దశలో ఉందని పీజీటీఎ్సఏయూ ఉపకులపతి ప్రొఫెసర్ ఆల్దాస్ జానయ్య తెలిపారు. ఈ వెస్టర్న్ సిడ్నీ వర్సిటీ అందించే అన్ని వ్యవసాయ కోర్సులకు భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐకార్) గుర్తింపు ఉందని జానయ్య పేర్కొన్నారు. ఈ ప్రత్యేక కోర్సుల ప్రవేశాల కోసం త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపారు.
ఇవి కూడా చదవండి
Drunk Driving Incident: మద్యం తాగుతూ ఫుల్ స్పీడ్తో రైడ్.. వీడియో వైరల్
Donald Trump: విదేశాల్లో నిర్మించిన చిత్రాలపై 100% సుంకం..ఆ జైలు తిరిగి ప్రారంభిస్తాం
Read Latest Telangana News And Telugu News