Natural farming: జాతీయ ప్రకృతి వ్యవసాయ పథకం కింద గ్రాంట్లు
ABN , Publish Date - May 31 , 2025 | 04:13 AM
సంప్రదాయ వ్యవసాయాన్ని శాస్ర్తీయ దృక్పథంతో పునరుద్ధరించడం, పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతూ రసాయనాల బెడద లేని ఆరోగ్యకర ఆహారాన్ని..

రూ.50 లక్షల వరకు సాయం పొందే అవకాశం
హైదరాబాద్, మే 30(ఆంధ్రజ్యోతి): సంప్రదాయ వ్యవసాయాన్ని శాస్ర్తీయ దృక్పథంతో పునరుద్ధరించడం, పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతూ రసాయనాల బెడద లేని ఆరోగ్యకర ఆహారాన్ని అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రకృతి వ్యవసాయ పథకాన్ని(నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్) ప్రారంభించిందని తెలంగాణ వ్యవసాయ శాఖ డైరెక్టర్ బి.గోపి తెలిపారు. దీనికి సంబంధించి భారత వ్యవసాయ పరిశోధన మండలి(ఐసీఎమ్ఆర్) పోటీ పరిశోధన గ్రాంట్లను(కాంపిటీటివ్ రీసెర్చ్ గ్రాంట్) ప్రకటించిందన్నారు.
కేంద్ర, రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, ఐసీఎఆర్ సంస్థలు, ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థలు, ప్రభుత్వేతర సంస్థలతో పాటు ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు, గుర్తింపు పొందిన పరిశోధనా సంస్థలు ఈ సీఆర్జీ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని వెల్లడించారు. ఈ గ్రాంట్ క్రింద గరిష్టంగా రూ.50 లక్షల వరకు సాయం పొందవచ్చని తెలిపారు. సీఆర్జీ కోసం ప్రతిపాదనలను జూన్ 5 సాయంత్రం ఐదున్నరలోగా పోర్టల్లో సమర్పించాలని తెలిపారు. సందేహాల నివృత్తి కోసంలో సంప్రదించవచ్చని గోపి తెలిపారు.