మోదీ పాలనలో అప్రజాస్వామిక విధానాలు
ABN , Publish Date - Jun 10 , 2025 | 12:42 AM
ప్రధాని నరేంద్రమోదీ పాలనలో అప్రజాస్వామిక విధానాలు రాజ్యమేలుతున్నాయని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యడు సాయిబాబు ఆరోపించారు. గుట్టలో మూడు రోజుల పాటు జరగనున్న సీపీఎం జిల్లాస్థాయి రాజకీయ శిక్షణ తరగతులను సోమవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు.

సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు సాయిబాబు
యాదగిరిగుట్ట రూరల్, జూన్ 9 (ఆంధ్రజ్యో తి): ప్రధాని నరేంద్రమోదీ పాలనలో అప్రజాస్వామిక విధానాలు రాజ్యమేలుతున్నాయని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యడు సాయిబాబు ఆరోపించారు. గుట్టలో మూడు రోజుల పాటు జరగనున్న సీపీఎం జిల్లాస్థాయి రాజకీయ శిక్షణ తరగతులను సోమవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రధాని మోదీ పాలనలో గోది మీడియా అరాచక ప్రచారం దేశమేలుతోందని, అమెరికా తరహాలో అధ్యక్ష పాలన కోసం బీజేపీ ప్రయత్నం చేస్తోందని, దీన్ని తిప్పికొట్టే బాధ్యత కమ్యూనిస్టులపై ఉందన్నారు. గత ప్రధాన మంత్రుల పాలనలో రూ.50లక్షల కోట్ల అప్పులు చేస్తే నరేంద్ర మోదీ రూ.170లక్షల కోట్ల అపు చేసి దేశాన్ని అప్పుల దేశంగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ వైపు ప్రపంచమంతా శాస్త్రీయంగా అభివృద్ధి చెందుతుంటే మన దేశంలో మాత్రం మూఢాచారాల కు పెద్దపీట వేస్తూ బీజేపీ పాలన చేస్తోందన్నా రు. దేశంలో భద్రతా వైఫల్యంతో పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది ప్రజల ప్రాణాలకు నరేంద్ర మోదీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రోజు రోజుకూ మహిళలపై గృహహింస, దాడులు పెరుగుతున్నాయని అందుకు మణిపూర్ రాష్ట్రంలో జరిగిన మహిళలపై దాడి నిదర్శనమన్నారు. మోదీ పాలనకు వ్యతిరేకంగా దేశభక్తులంతా పోరాటలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అంతకు ముందు పార్టీ పతాకాన్ని మండల కార్యదర్శి బబ్బూరి పోశెట్టి ఆవిష్కరించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్, రాష్ట్ర కమిటీ సభ్యుడు కొండమడుగు నర్సింహ, బట్టుపల్లి అనురాధ, కార్యవర్గ సభ్యులు కల్లూరి మల్లేశం, దాసరి పాండు, జెల్లెల పెంటయ్య, బూరుగు కృష్ణారెడ్డి, గుంటోజు శ్రీనివాసచారి, నూకల భాస్కర్రెడ్డి, ఎస్కె.లతీఫ్, కాల్నే స్వామి, జోగు శ్రీనివాస్, పాల్గొన్నారు.