Share News

కాళేశ్వరం పేరుతో కాలయాపన

ABN , Publish Date - Jun 13 , 2025 | 12:28 AM

కాళేశ్వరం పేరుతో అధికార, ప్రతిపక్షాలు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటూ కాలయాపన చేస్తున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి విమర్శించారు.

కాళేశ్వరం పేరుతో కాలయాపన
రాజకీయ శిక్షణ తరగతుల్లో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి

హుజూర్‌నగర్‌, జూన్‌ 12(ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం పేరుతో అధికార, ప్రతిపక్షాలు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటూ కాలయాపన చేస్తున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. గురువారం పట్టణంలో సీపీఎం జిల్లా శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం మావోయిస్టుల నిర్మూలన పేరుతో నరమేధం చేస్తోందన్నారు. కగార్‌ ఆపరేషన్‌ పేరుతో మావోయిస్టులను చంపడం సరికాదన్నారు. మావోయిస్టులతో చర్చలు జరపాలన్నారు. ప్రజాస్వామ్యంలో పౌరులను చంపే హక్కు ప్రభుత్వానికి లేదన్నారు. కాళేశ్వరంలో జరిగిన అవినీతిపై చర్చ జరగాలన్నారు. ప్రభుత్వానికి కాళేశ్వరంపై చిత్తశుద్ధి లేదన్నారు. పాలస్తీనాపై ఇజ్రాయిల్‌ యుద్ధం నిలిపివేయా లని ఈ నెల 17న రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. బీజేపీతో దేశానికి ప్రమాదముందన్నారు. రాజ్యాంగ సంస్థలను గుప్పిట్లో పెట్టుకుని దాడులు చేస్తున్నారని ఆరోపించారు. పెండింగ్‌ ప్రాజెక్ట్‌లను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయాలన్నారు. ఆరు గ్యారెంటీలను అమలుచేయడం లేదన్నారు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరుచేయాలన్నారు. ఆర్‌ఎ్‌సఎస్‌ ఎజెండాను మోదీ అమలు చేస్తున్నారన్నారు. రాజకీయ శిక్షణ తరగతులలో అనేక కీలకాంశాలను చర్చించినట్లు తెలిపారు. పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈకార్యక్రమంలో నాగారపు పాండు, పల్లె వెంకటరెడ్డి, పొలిశెట్టి యాదగిరి, నెమ్మాది వెంకటేశ్వర్లు, ముల్కలపల్లి రాములు, పోసనబోయిన హుస్సేన్‌, బ్రహ్మం, అనంతప్రకాశ్‌, యాకోబ్‌, నగేష్‌, బాలునాయక్‌, వెంకటచంద్ర, వీరమల్లు, మురళి, యోనా, వీరస్వామి, త్రివేణి, శీలం శ్రీను, శివకుమార్‌, రవి పాల్గొన్నారు.

Updated Date - Jun 13 , 2025 | 12:28 AM